Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Valimai Postponed ప్రతికూల పరిస్థితుల్లో తప్పడం లేదు.. బోనికపూర్ వెల్లడి
దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు భారీగా పెరిగిపోతుండటంతో పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూలు, లాక్డౌన్స్ విధిస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొంటున్నాయి. తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, బీహార్, హర్యానా లాంటి రాష్ట్రాలు థియేటర్లలో ప్రదర్శనలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి రేసులో నిలిచిన చిత్రాలు తమ రిలీజ్ను వాయిదా వేసుకొంటున్నాయి. ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో అజిత్ నటించిన వలిమై చిత్రం థియేటర్లలో రిలీజ్ అవుతుందనే వార్తలు గురువారం ఉదయం నుంచి భారీగా పోటెత్తాయి. దాంతో ఈ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ భారీగా జరిగింది. వలిమై సినిమా రిలీజ్పై వస్తున్న రూమర్లపై నిర్మాత బోనికపూర్ సోషల్ మీడియాలో స్పందించారు. ఈ సినిమా రిలీజ్ క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన చేశారు.
దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న వలిమై చిత్ర రిలీజ్ను వాయిదా వేస్తున్నాం. ఆడియెన్స్, ఫ్యాన్స్ అంటే మాకు ఎల్లప్పడూ అత్యంత గౌరవం. ప్రతికూల సమయంలో వారు ఇచ్చిన బేషరుతుగా ఇచ్చిన సపోర్ట్ మాటల్లో చెప్పలేనది. వారి సానుకూలత మాలో ఆశలను రేపింది. అనేక ఒడిదుడుకులను అధిగమించేందుకు తోడ్పాటును అందించింది. అంతేకాకుండా ఈ సినిమా షూటింగును పూర్తి చేసేందుకు మాకు స్పూర్తిని కలిగించింది. అభిమానుల అంచనాలకు తగినట్టే థియేటర్లలో సినిమాను తీసుకొచ్చి సంతోషాన్ని నింపాలనుకొన్నాం.
అయితే వలిమై సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనతో మేము నిర్ణయం తీసుకొనే ముందు ప్రేక్షకులు, అభిమానుల సేఫ్టిని పరిగణనలోకి తీసుకొన్నాం. తీక్షణంగా ఆలోచించాం. కానీ ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మాలో ఆందోళన మొదలైంది. అధికారుల సూచనలు, ప్రభుత్వ నిబంధనలను అనుసరించి వలిమై సినిమా రిలీజ్ను వాయిదా వేస్తున్నాం. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత వలిమైను థియేటర్లలో రిలీజ్ చేస్తాం అని బోని కపూర్ తన సుదీర్గమైన పోస్టులో పేర్కొన్నారు.
అంతేకాకుండా ప్రేక్షకులు, అభిమానులందరూ వ్యాక్సిన్స్ తీసుకోండి. మాస్క్ తప్పనిసరిగా ధరించండి. సురక్షితం ఉండండి. త్వరలోనే మీ అందర్ని థియేటర్లలో కలుసుకొంటాం అని బోని కపూర్ అన్నారు.