Don't Miss!
- News చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోమారు కుమ్మక్కు: ఓటుకు నోటు కేసుపై ఎమ్మెల్యే ఆర్కే సంచలనం
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Finance Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వాల్మీకి x గ్యాంగ్లీడర్: వివాదానికి చెక్.. ఊపిరి పీల్చుకొన్న నాని, వరుణ్ తేజ్
సినీ పరిశ్రమలో రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అవుతూ ఓ రకమైన పోటీ వాతావరణం క్రియేట్ చేస్తుంటాయి. కొన్నిసార్లు పోటీ కారణంగా నిర్మాతలు నష్టపోయిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా నాని నటించిన గ్యాంగ్ లీడర్, వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి చిత్రాలు ఒకేరోజు రిలీజ్ కావడంపై ఆందోళన రేకెత్తింది. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ గిల్డ్ సభ్యులు నిర్మాత దిల్ రాజు, బీవీఎస్ఎన్ ప్రసాద్, ఏకే ఎంటర్టైన్ అనిల్ సుంకర తదితర నిర్మాతలు సమావేశంపై రిలీజ్ డేట్స్ మార్చడం జరిగింది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..
వాల్మీకి, గ్యాంగ్ లీడర్ క్లాష్
సెప్టెంబర్ 13 తేదీన వాల్మికీ, గ్యాంగ్ లీడర్ రిలీజ్ చేయాలని గతంలో నిర్ణయం జరిగింది. సాహో రిలీజ్ డేట్ మారడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. ఒకే రోజు రెండు సినిమాలు క్లాష్ కావడం కొంత కష్టంగా అనిపించింది. సాహో వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. వెంటనే అక్టోబర్ 2వ తేదీన సైరా రిలీజ్ డేట్ కూడా ఉండటంతో చేసేదేమీ లేక అదే డేట్ రెండు చిత్రాల విడుదలకు పోటీ ఏర్పడింది అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.
నిర్మాతలకు నష్టమని
ఇలా వాల్మీకి, గ్యాంగ్ లీడర్ సినిమాలు ఒకే రోజున పోటీ పడటం వల్ల నిర్మాతలకు నష్టం వాటిల్లే పరిస్థితి కనిపించింది. అందుచేత ప్రొడ్యూసర్స్ గిల్డ్లో ఉన్న నిర్మాతలిద్దరం కలిసి చర్చించుకొన్నాం. గ్యాంగ్ లీడర్ సెప్టెంబర్ 13వ రోజున, వాల్మీకి చిత్రాన్ని సెప్టెంబర్ 20 తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకొన్నాం అని దిల్ రాజు అన్నారు. ఇలాంటి సమస్యను పరిష్కరించిన 14 రీల్స్కు థ్యాంక్స్ తెలియజేస్తున్నామన్నారు.
పండగ సీజన్ల ఒకే
సాధారణంగా హాలీడేస్ సమయంలో రెండు సినిమాలు వస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. ఎందుకంటే సెలవుల్లో రెండు సినిమాలు వచ్చిన ప్రేక్షకాదరణ ఉంటుంది. కానీ సెలవు లేని సమయంలో రెండు సినిమాలు పోటీ పడితే ఎవరో ఒకరికి నష్టం వాటిల్లుతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకొన్నాం. భవిష్యత్లో కూడా ఇలాంటి సమస్యలను నివారించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన 14 రిల్స్కు వాల్మీకి దర్శకుడు హరీష్ శంకర్, హీరో వరుణ్ తేజ్ థ్యాంక్స్ చెప్పారు అని దిల్ రాజు తెలియజేశారు.
సైరా, సాహో మూవీస్ను
సాహో 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. కాబట్టి ఆ సినిమాను గౌరవించాలని ప్రొడ్యూసర్ గిల్డ్ భావించింది. అలాగే సైరా మూవీది కూడా అదే పరిస్థితి. భారీ బడ్జెట్తో రూపొందిన సైరా ప్యాన్ ఇండియా మూవీగా మారింది. కాబట్టి వాటికి ఉన్న ప్రాధాన్యతను బట్టి మేము మా డేట్స్ను మార్చుకొన్నాం అని దిల్ రాజు ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పండగల సమయంలో సినిమాలకు మినహాయింపు ఉంటుందన్నారు.