Don't Miss!
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్గా పరుగుల చిరుత.!
- News కూతురు ఎవరికైనా కూతురే, ఎన్నికల సమయంలో రాజకీయాలా, నీతులు చెబుతున్న లీడర్!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
స్టార్ హీరోలు రిజెక్ట్ చెయడంతో... వెబ్ సిరీస్ వైపు అడుగులు వేస్తున్న మహేష్ డైరెక్టర్!
మున్నా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వంశీ పైడిపల్లి స్టార్ డైరెక్టర్ అనే పదానికి చాలా దగ్గరగా ఉన్నాడు గాని పూర్తి స్థాయిలో ఆ బ్రాండ్ ని అందుకోలేకపోతున్నాడు. బృందావనం, ఎవడు, మహర్షి అంటూ స్టార్ హీరోలతోనే బిగ్ బడ్జెట్ సినిమాలు చేశాడు. అసలైతే మహర్షి అనంతరం వంశీ పైడిపల్లి మళ్ళీ మహేష్ తోనే ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ వర్కౌట్ కాలేదు.
రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా చేయాలని ప్లాన్ వేసినా కూడా కుదరలేదని కామెంట్స్ వచ్చాయి. చేస్తే పెద్ద హీరోలతోనే వర్క్ చేయాలని చిన్న హీరోలను ఈ దర్శకుడు పట్టించుకోవడం లేదని ఒక టాక్ కూడా వస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇప్పుడు వంశీ ఒక స్టార్ హీరో కోసం ఏడాది వరకు వెయిట్ చేయాలని అనుకుంటున్నాడట. ఇక ఖాళీగా ఉండకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఒక మంచి కాన్సెప్ట్ తో వెబ్ సిరీస్ ప్లాన్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకు బడా నిర్మాత అల్లు అరవింద్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు టాక్. ప్రస్తుత కాలంలో చిన్న పెద్దా తేడా లేకుండా అందరు దర్శకులు వెబ్ సీరీస్ లను డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు వంశీ పైడిపల్లి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫుల్ స్క్రిప్ట్ పూర్తి చేసిన తరువాత త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని ఈ దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.