Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పెళ్లి.. కీర్తితో కలిసి సందడి చేసిన జయమ్మ!
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో సినిమా షూటింగ్స్ అన్ని వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెకండ్ వేవ్ లో కూడా సినిమా వాళ్ల పెళ్లిళ్లు మొదలయ్యాయి. గత ఏడాది కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది సినిమా వాళ్ళు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడు అదే కోవలో వరుసగా సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన జీకే విష్ణు ఒక ఇంటివాడయ్యాడు. ఈ ఏడాది మొదట్లో సూపర్ హిట్ అందుకున్న క్రాక్ సినిమాకు ఆయన సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమానే కాక విజయ్ హీరోగా వచ్చిన బిగిల్, మెర్సల్, విశాల్ హీరోగా వచ్చిన అయోగ్య లాంటి సినిమాలకు కూడా ఆయన సినిమాటోగ్రఫీ అందించారు.
ఈ రోజు ఆయన మహా అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది సినీ ప్రముఖులు స్వయంగా హాజరై ఆయనకు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ తో వరలక్ష్మి శరత్ కుమార్ తీసుకున్న సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరూ కలిసి విశాల్ హీరోగా నటించిన సందె కోడి 2(పందెంకోడి 2) లో నటించిన సంగతి తెలిసిందే, ఇక క్రాక్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ జయమ్మ పాత్రలో నటించి ప్రజలను మెప్పించిన సంగతి తెలిసిందే.
ఇక క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని సైతం ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ ముగ్గురు తీసుకున్న సెల్ఫీ సైతం వరలక్ష్మీ శరత్ కుమార్ షేర్ చేశారు. ఇక విష్ణు వివాహం సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతానికి కీర్తి సురేష్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా చేస్తోంది. గోపీ చాంద్ మలినేని బాలయ్యతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా వరుసగా తమిళ సినిమాలు ఒప్పుకున్నారు. తెలుగులో కూడా సందీప్ కిషన్ తో ఒక సినిమా చేస్తున్నారు.