Varanasi: రాజమౌళి మాస్టర్ ప్లాన్ అదే? వారణాసిపై నాగవంశీ కామెంట్స్..
Varanasi - Naga Vamsi: టాలీవుడ్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచిన సినిమా వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా, విడుదలకు ముందే గ్లోబల్ స్థాయిలో భారీ బజ్ను సృష్టిస్తోంది. టైటిల్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. రాజమౌళి ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారని టాక్. అందుకే సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చినా సరే, అది క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ వ్యూహాలపై ప్రముఖ నిర్మాత నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మార్కెటింగ్ ఆలోచనలను ప్రశంసలతో ముంచెత్తారు. రాజమౌళి సినిమాల విషయంలో కేవలం కంటెంట్ మాత్రమే కాకుండా, ప్రేక్షకుల్లో అంచనాలు పెంచే విధానంలో కూడా ఆయన ఒక అడుగు ముందడుగు వేశారని తెలిపారు. ముఖ్యంగా వారణాసి సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల చేసిన విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు.

'రాజమౌళి సార్ వారణాసిలో ప్రత్యేకంగా ఒక భారీ ఈవెంట్ నిర్వహించి, టీజర్ కూడా కాకుండా కేవలం సినిమా థీమ్ను పరిచయం చేసేలా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయడం నిజంగా కొత్త ఐడియా. ఇప్పటివరకు ఎవరూ ఇలా ఆలోచించలేదు. ఏ సినిమా తీస్తున్నామో చెప్పడానికే అంత గ్రాండ్ లెవెల్లో ఈవెంట్ చేయడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయనను మార్కెటింగ్ జీనియస్ అంటారు' అంటూ నాగ వంశీ ప్రశంసలు గుప్పించారు. ఈ మాటలు రాజమౌళి ప్రమోషన్ స్ట్రాటజీలపై ఇండస్ట్రీలో ఎంతటి గౌరవం ఉందో మరోసారి రుజువు చేస్తున్నాయి.
వారణాసి సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కోసమే ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించడం, రాజమౌళి మార్కెటింగ్ మైండ్సెట్ను స్పష్టంగా చూపిస్తోందని నాగ వంశీ అభిప్రాయపడ్డారు. కేవలం సినిమా పేరు చెప్పడానికే ప్రేక్షకులను నేరుగా ఎంగేజ్ చేసేలా ఈవెంట్ డిజైన్ చేయడం, సినిమా విడుదలకు ముందే గ్లోబల్ బజ్ క్రియేట్ చేయడం రాజమౌళి స్టైల్ అని పేర్కొన్నారు. ఇలాంటి ఆలోచనలు ఆయనకు మాత్రమే వస్తాయని, అందుకే ప్రతి సినిమా ఒక బ్రాండ్లా మారుతుందని అన్నారు.
ఇక వారణాసి గ్లింప్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. అందులోని విజువల్స్ చాలా హై లెవెల్లో ఉన్నాయని నాగ వంశీ తెలిపారు. ' వారణాసి గ్లింప్స్ చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా అంజనేయ స్వామి షాట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆ సన్నివేశాలు ఐమాక్స్ స్క్రీన్పై చూస్తే అసలు ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది' అని చెప్పారు.
ఈ సందర్భంగా ఐమాక్స్ థియేటర్ల గురించి మాట్లాడుతూ.. 'ఈ సినిమా విడుదలయ్యేలోపు హైదరాబాద్లో కనీసం రెండు మూడు ఐమాక్స్ థియేటర్లు ఓపెన్ అయితే బాగుంటుంది. లేకపోతే ఈ సినిమా చూడాలంటే వేరే ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది" అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఐమాక్స్ లెవెల్ సినిమాలు ఎక్కువగా రూపొందుతున్నాయని, అందుకే భవిష్యత్తులో మరిన్ని ఐమాక్స్ థియేటర్లు అవసరమని ఆయన సూచించారు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఏకంగా ఐదు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారన్న ప్రచారం కూడా అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. ప్రధానంగా 'రుద్ర' అనే సూపర్మ్యాన్ తరహా పాత్రలో ఆయన కనిపించనున్నారని సమాచారం. కథానాయికగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా 'మందాకిని' అనే పాత్రలో నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఆమె పాత్ర కూడా కథలో కీలక మలుపులు తిప్పేలా ఉంటుందని తెలుస్తోంది. విలన్ పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
ప్రస్తుతం షూటింగ్ వివిధ షెడ్యూల్స్లో కొనసాగుతుండగా, మహేష్ బాబు తన కీలక పార్ట్ను 2026 సమ్మర్ నాటికి పూర్తి చేయనున్నారని సమాచారం. ఆ తర్వాత భారీ స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేపట్టి, 2027 సమ్మర్లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ పరిణామాల నేపథ్యంలో, రాజమౌళి కేవలం దర్శకుడిగానే కాకుండా ఒక మార్కెటింగ్ జీనియస్గా కూడా మరోసారి తన సత్తా చాటుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక 'వారణాసి' గ్లోబల్ బాక్సాఫీస్ను ఎంతగా షేక్ చేస్తుందో చూడాలంటే, ప్రేక్షకులు ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











