Don't Miss!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కరోనా క్రైసిస్ ఛారిటీ: సినీ కార్మికుల కోసం మెగా వారసుడి విరాళం
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశమంతటా లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. దీంతో సినిమా ఎక్కడికక్కడ షూటింగ్స్ నిలిచిపోయాయి. సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమై హోమ్ క్వారంటైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ స్తంభించిపోవడం, సినీ కార్మికుల ఉపాధికి గండి పడటం జరిగాయి.
ఈ విపత్కర పరిస్థితుల్లో అందరికీ అండగా మేమున్నాం అంటూ స్వచ్చందంగా ముందుకొస్తున్నారు పలువురు సినీ ప్రముఖులు. ఇందులో భాగంగా సినిమా రంగాన్ని ఆడుకునెనుదుకు కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించిన ప్రముఖులు.. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో 'సి.సి.సి. మనకోసం' (కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం) అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సినీ కార్మికులను ఆదుకోవడానికి ప్రముఖులు ముందుకు రావాలని కోరారు.
ఈ పిలుపుకు స్పందించిన యువ హీరో వరుణ్ తేజ్ తన వంతుగా ఈ సినీ కార్మికుల సహాయ నిధికి రూ. 20 లక్షలు వితరణ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ కష్ట సమయంలో ఇబ్బంది పడుతున్న మన సినిమా కార్మికులకు సి.సి.సి ద్వారా మంచి జరగాలని కోరుకుంటున్నా అని వరుణ్ తేజ్ అన్నారు.