Don't Miss!
- Sports హార్దిక్కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- News రిజల్ట్ తరువాత సీఎం కుర్చీ హుష్ కాకి, హైకమాండ్ వెయిటింగ్, గాలి జనార్దన్ రెడ్డి సంచలనం
- Finance Adani-Birla: అదానీని టార్గెట్ చేసిన బిర్లా.. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కొనుగోలు..
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కరోనా క్రైసిస్ ఛారిటీ: సినీ కార్మికుల కోసం మెగా వారసుడి విరాళం
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశమంతటా లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. దీంతో సినిమా ఎక్కడికక్కడ షూటింగ్స్ నిలిచిపోయాయి. సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమై హోమ్ క్వారంటైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ స్తంభించిపోవడం, సినీ కార్మికుల ఉపాధికి గండి పడటం జరిగాయి.
ఈ విపత్కర పరిస్థితుల్లో అందరికీ అండగా మేమున్నాం అంటూ స్వచ్చందంగా ముందుకొస్తున్నారు పలువురు సినీ ప్రముఖులు. ఇందులో భాగంగా సినిమా రంగాన్ని ఆడుకునెనుదుకు కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించిన ప్రముఖులు.. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో 'సి.సి.సి. మనకోసం' (కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం) అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సినీ కార్మికులను ఆదుకోవడానికి ప్రముఖులు ముందుకు రావాలని కోరారు.
ఈ పిలుపుకు స్పందించిన యువ హీరో వరుణ్ తేజ్ తన వంతుగా ఈ సినీ కార్మికుల సహాయ నిధికి రూ. 20 లక్షలు వితరణ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ కష్ట సమయంలో ఇబ్బంది పడుతున్న మన సినిమా కార్మికులకు సి.సి.సి ద్వారా మంచి జరగాలని కోరుకుంటున్నా అని వరుణ్ తేజ్ అన్నారు.