Don't Miss!
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- News Iran Israel War: ఇరాక్ నూ కెలికిన ఇజ్రాయెల్? ఇరాన్ ఉమ్మడి పోస్టుపై దాడి-పోరు తీవ్రం..!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
కరోనా క్రైసిస్ ఛారిటీ: సినీ కార్మికుల కోసం మెగా వారసుడి విరాళం
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశమంతటా లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. దీంతో సినిమా ఎక్కడికక్కడ షూటింగ్స్ నిలిచిపోయాయి. సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమై హోమ్ క్వారంటైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ స్తంభించిపోవడం, సినీ కార్మికుల ఉపాధికి గండి పడటం జరిగాయి.
ఈ విపత్కర పరిస్థితుల్లో అందరికీ అండగా మేమున్నాం అంటూ స్వచ్చందంగా ముందుకొస్తున్నారు పలువురు సినీ ప్రముఖులు. ఇందులో భాగంగా సినిమా రంగాన్ని ఆడుకునెనుదుకు కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించిన ప్రముఖులు.. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో 'సి.సి.సి. మనకోసం' (కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం) అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సినీ కార్మికులను ఆదుకోవడానికి ప్రముఖులు ముందుకు రావాలని కోరారు.
ఈ పిలుపుకు స్పందించిన యువ హీరో వరుణ్ తేజ్ తన వంతుగా ఈ సినీ కార్మికుల సహాయ నిధికి రూ. 20 లక్షలు వితరణ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ కష్ట సమయంలో ఇబ్బంది పడుతున్న మన సినిమా కార్మికులకు సి.సి.సి ద్వారా మంచి జరగాలని కోరుకుంటున్నా అని వరుణ్ తేజ్ అన్నారు.