Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ముంబై బయల్దేరిన మెగా వారసుడు.. ఎందుకో తెలుసా..?
ఇటీవలే గద్దలకొండ గణేష్ సినిమాతో భారీ విజయం సొంతం చేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ప్రస్తుతం తన తదుపరి సినిమాతో బిజీ కాబోతున్నాడు. ఆయన కెరీర్లో పదో సినిమాగా రానున్న సినిమా కోసం స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడు. ఈ మేరకు ఆయన ముంబై బయల్దేరినట్లుగా తెలుస్తోంది.
వైవిద్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీని నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో చేయబోతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. కెరీర్లో తొలిసారిగా వరుణ్ ఈ సినిమాలో బాక్సర్గా కనిపించబోతున్నాడు. ఇందుకోసం ఆయన స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నాడు.
ఇందుకోసమై ఆయన 2 నెలల పాటు బాక్సింగ్లో శిక్షణ పొందడానికి ముంబై వెళుతున్నాడు. బాక్సింగ్ లో శిక్షణను పూర్తిచేసుకుని తిరిగి డిసెంబర్ నెలలో హైద్రాబాద్ చేరుకుంటారట. ఆ తర్వాత వెంటనే జనవరి నెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారు. అల్లు బాబీ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి థమన్ బాణీలు కట్టనున్నారు.
ఈ చిత్రానికి జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రాఫర్. హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. టైటిల్ కూడా కన్ఫర్మ్ చేయలేదు. చిత్రం లోని ఇతర నటీనటుల వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు. వరుస సినిమాలతో జోష్లో ఉన్న వరుణ్ తేజ్ ఈ మధ్య డిఫరెంట్ లుక్ లోకి మారడమే గాక, వినూత్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కారణంగా ఆయన సినిమాలపై క్రేజ్ పెరుగుతూ వస్తోంది.