Don't Miss!
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
యూఎస్ఏలో వరుణ్ తేజ్, ‘వాల్మీకి’ షూట్లో జాయిన్ అయ్యేది ఎప్పుడంటే..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'ఎఫ్ 2' విజయం తర్వాత రెండు సినిమాలకు కమిట్ అయ్యారు. అందులో ఒకటి హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వాల్మీకి'. తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండ చిత్రానికి ఇది రీమేక్.
ప్రస్తుతం వరుణ్ తేజ్ యూఎస్ఏలో తన మరో మూవీ కోసం బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. యూఎస్ఏలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 16 నుంచి 'వాల్మీకి' షూటింగులో వరకుణ్ జాయిన్ అవుతారని టాక్.
ఈ చిత్రానికి సంగీతం: రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్, కథ: కార్తీక్ సుబ్బరాజ్, స్క్రీన్ప్లే: మధు, చైతన్య, ఆర్ట్: అవినాష్ కొల్ల, ఎడిటింగ్: ఛోటా కె.ప్రసాద్, ఫైట్స్: రామ్లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట, మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్.
ఒరిజినల్ వెర్షన్ 'జిగర్తాండ' తమిళంలో 2014లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో విడుదలైంది. సిద్ధార్థ్, బాబీ సింహ, లక్ష్మీ మీనన్ ముఖ్య పాత్రల్లో నటించారు. అప్పట్లో రూ. 10 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 35 కోట్లు వసూలు చేసి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.