Don't Miss!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
చిరంజీవియే పంపించారు.. అప్పట్లో హీరో అంటే! వరుణ్ తేజ్ షాకింగ్ కామెంట్స్
వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు మెగా వారసుడు వరుణ్ తేజ్. తాజాగా ఆయన చేసిన సినిమా 'వాల్మీకి'. ఈ సినిమాలో ఇప్పటిదాకా కనిపించని డిఫెరెంట్ లుక్లో కనిపించనున్నాడు వరుణ్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తన లుక్ గురించి స్పందిస్తూ ఆసక్తికర విషయాలు చెప్పాడు వరుణ్. ఆ వివరాలు చూస్తే..
గద్దలకొండ గణేష్గా వరుణ్
ఇటీవలే విడుదలైన వాల్మీకి ట్రైలర్ లో వరుణ్ క్యారెక్టర్, లుక్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. దీంతో మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఈ సినిమా పట్ల ఆసక్తిగా ఉన్నారు. గద్దలకొండ గణేష్ క్యారెక్టర్లో వెండితెరపై వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ చూడాలని కుతూహలపడుతున్నారు. యూ ట్యూబ్లో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టిన వాల్మీకి ట్రైలర్ సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
చిరంజీవియే పంపించారు
‘వాల్మీకి'లో తన లుక్పై వరుణ్ స్పందించాడు. తన లుక్ కోసం పెదనాన్న చిరంజీవి నటించిన నాటి చిత్రం ‘పునాదిరాళ్లు' సినిమాను ప్రేరణగా తీసుకున్నానని చెప్పాడు. అంతేకాదు ఆ సినిమాలో చిరంజీవి లుక్ ని తన మొబైల్ లోచూపించాడు వరుణ్. ఈ ఫొటోను చిరంజీవి తనకు పంపారని చెప్పాడు. అప్పట్లో హీరో అంటే ఇలాగే జుట్టుతో ఉంటారనేది తన అభిప్రాయమని వరుణ్ అన్నాడు.
శ్రీదేవిగా పూజా హెగ్డే
ఇక హీరోయిన్ పూజా హెగ్డే క్యారెక్టర్ విషయానికొస్తే.. ఈ చిత్రంలో శ్రీదేవిగా నటిస్తోంది పూజా. లంగా ఓని వేసుకొని శ్రీదేవి రూపంలో సైకిల్పై అలా వచ్చి ఫస్ట్ లుక్లోనే అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. దీంతో శ్రీదేవి పాత్రపై కూడా ఓ రకమైన ఇంట్రెస్ట్ నెలకొంది ప్రేక్షకుల్లో.
వాల్మీకి మూవీ
హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందింది 'వాల్మీకి' సినిమా. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్గా వాల్మీకి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 20వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి.