Don't Miss!
- News సీఎం జగన్ ను హతమార్చేందుకే గులకరాయితో దాడి.. షాకింగ్ రిమాండ్ రిపోర్ట్!!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాక్సింగ్లో ఫైనల్ రౌండ్కు చేరిన మెగా హీరో: ఫైటింగ్ మొదలైందని ప్రకటన
కొంత కాలంగా వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఆ ఫలితాలు ఇచ్చిన జోష్లోనే మరిన్ని ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పట్టాలెక్కిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' అనే సినిమాను చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంతో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ వాయిదా పడడంతో టాకీ పార్ట్ను పూర్తి చేయలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ఇచ్చింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'గని' చివరి షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఫిల్మ్ స్టూడియోలో ప్రారంభం అయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. దానిపై ఫైనల్ రౌండ్ ప్రారంభం అని పేర్కొంది. ఇక, ఈ షెడ్యూల్లో క్లైమాక్స్ ఫైట్ సీన్ను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం హాలీవుడ్ నుంచి యాక్షన్ కొరియోగ్రాఫర్లు లార్నెల్ స్టోవల్, లాడ్ రింబర్గ్ను తీసుకు వచ్చారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు ఇది రెండు వారాల పాటు జరుగుతుందని కూడా తెలిసింది.
యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న 'గని' సినిమాలో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్గా నటిస్తున్నాడు. ఇందుకోసం చాలా కాలం పాటు అమెరికాలో బాక్సింగ్లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక, ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర కూడా హీరోకు పోటీనిచ్చే బాక్సర్గా చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. వీళ్లతో పాటు సునీల్ శెట్టి, కన్నడ హీరో ఉపేంద్ర కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.