Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
జీవా, నయనతార ‘వీడే సరైనోడు’ క్లైమాక్స్కు సూపర్బ్ టాక్
జీవా, నయనతార జంటగా తమిళంలో 2016లో తెరకెక్కిన 'తిరునాల్' చిత్రాన్ని తెలుగులో 'వీడే సరైనోడు' పేరుతో అనువదించారు. నోవా సినిమాస్ పతాకంపై కోకా శిరీష సమర్పణలో జక్కుల నాగేశ్వరరావు అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 6న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సందర్భంగా జక్కుల నాగేశ్వరరావు మాట్లాడుతూ... కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా తప్పకుండా ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. గతంలో మా 'లవ్ జర్నీ' చిత్రాన్ని ఆదరించినట్లు ఇప్పుడు 'వీడే సరైనోడు' చిత్రాన్ని ప్రేక్షక దేవుళ్లు ఆదరిస్తున్నారు. విడుదలైన అన్ని ఏరియాల నుండి గుడ్ మంచి రెస్పాన్స్ వస్తోందని తెలిపారు.
ఈ చితరంలో హీరో హీరోయిన్ నటనతో పాటు ప్రముఖ నటీనటులు పెర్ఫార్మెన్స్కు మంచి స్పందన వస్తోంది. క్లైమాక్స్ చాలా బావుందని అందరూ అంటున్నారు. మా సినిమా పబ్లిసిటీకి బాగా ఖర్చు పెట్టి అందరికీ సినిమా గురించి తెలిసేలా చేసిన నిర్మాత కొక శిరీషగారికి థాంక్స్. మున్ముందు మేము మరిన్ని సినిమాలకు కలిసి పని చేస్తామని నాగేశ్వరరావు తెలిపారు.
'వీడే సరైనోడు' సినిమా చూడాలి స్పెషల్ షో వెయ్యమని ఇండస్ట్రీలో చాలామంది అడుగుతున్నారు. నేను విడుదల చేసిన సినిమాల్లో ఇది పెద్ద సక్సెస్ సాధించడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు చేస్తామన్నారు.
ఈ చిత్రంలో జీవా, నయనతార, శరత్ లోహిత్వా, కరుణ, కరుణాస్, జో మల్లూరి, రామ, గోబినాథ్, జంగిరి మధుమిత, మీనాక్షి, డి. ఆర్. కె. కిరణ్, వి. ఐ. ఎస్. జయపాలన్, రామ్దాస్ జి. మారిముత్తు, సుజాత శివకుమార్, రామచంద్రన్ దురైరా ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం : శ్రీకాంత్ దేవా, సాహిత్యం : వెన్నెలకంటి, చంద్రబోస్, మాటలు : రాజశేఖర్ రెడ్డి, కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి. ఎస్.రామనాథ్