Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
కోనసీమ నేపథ్యంలో వెంకటేష్, చైతు చిత్రం!
విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 చిత్రంలో కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఇప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. వెంకటేష్ మరో చిత్రానికి సిద్ధం అవుతున్నాడు.రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా మల్టీస్టారర్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని దరకుడు బాబీ. చాలా రోజుల క్రితమే ప్రకటించినా ఇంత వరకు ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళలేదు. వెంకీ మామ అనే ఫన్నీ టైటిల్ తో రూపొందబోతున్న ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ రాజమండ్రిలో ప్రారంభం కాబోతోంది.
కోనసీమ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. వెంకీ, చైతు కోనసీమ యాసలో చేసే అల్లరి ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కోన వెంకట్, సురేష్ బాబు కలసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఎఫ్2 తర్వాత వెంకీ నుంచి రాబోతున్న మరో మల్టీస్టారర్ చిత్రం ఇది. చాలా రోజులుగా అక్కినేని, దగ్గుబాటి కాంబోలో సినిమాకోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రంలో వెంకటేష్ కు జోడిగా శ్రీయ, నాగ చైతన్యకు హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపీలకైనట్లు తెలుస్తోంది. ఎఫ్2 చిత్రంతో చాలా రోజుల తర్వాత తనలో కామెడీ యాంగిల్ బయట పెట్టిన వెంకీ ఈ చిత్రంతో ఎలాంటి రచ్చ చేస్తాడో వేచి చూడాలి.