Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిగ్ బడ్జెట్ సినిమా కోసం మరో స్టార్ హీరోను లైన్లో పెట్టిన మంచు విష్ణు..
టాలీవుడ్ లో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యువ హీరోలు చాలా మంది ఉన్నారు. ఇక అందులో మంచు విష్ణు కూడా ఒకరు. ఈ హీరో సక్సెస్ కోసం గత కొన్నేళ్లుగా ఎన్నో డిఫరెంట్ సినిమాలు చేశాడు. కానీ ఏ సినిమా కూడా విజయాన్ని ఇవ్వలేదు. ఇక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పక్కనపెట్టిన విష్ణు మొదటిసారి హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి ఒక క్రైమ్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. వరల్డ్ బిగ్గెస్ట్ మనీ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మోసగాళ్ళు సినిమాతో సిద్దమవుతున్న విషయం తెలిసిందే.
గత రెండేళ్ల నుంచి ఈ సినిమాతో బిజీగా ఉన్న విష్ణు మొత్తానికి తుది దశకు చేర్చాడు. ఇక సినిమా జనాలకు చేరువయ్యేలా ప్రమోషన్స్ డోస్ కూడా పెంచుతున్నాడు. సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ ని అల్లు అర్జున్ తగో రిలీజ్ చేయించి మంచి హైప్ క్రియేట్ చేయించిన విష్ణు నెక్స్ట్ మరో పని కోసం సీనియర్ స్టార్ హీరోను లైన్ లో పెట్టాడు. ఆయన మరెవరో కాదు.. విక్టరీ వెంకటేష్. వెంకటేష్ మోసగాళ్ళు సినిమాకు తన వాయిస్ ఓవర్ ని అందించబోతున్నాడు.
వెంకటేష్ ఇదివరకే కొన్నిసార్లు ఇలాంటి ప్రయోగలతో ఆకట్టుకున్నారు. ఇక ఇటీవల మోసగాళ్ళు డబ్బింగ్ పనులు కూడా స్టార్ట్ చేశారు. సినిమాలో ఉండే ఇంట్రెస్టింగ్ సన్నివేశాలకు ఆయన తన మాటలతో మరింత హైలెట్ గా ప్రజెంట్ చేయనున్నారట. సినిమాను మంచు విష్ణు చాలా కాస్ట్లీగా నిర్మించినట్లు ఇప్పటికే అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. దాదాపు 60కోట్లకు పైగా ఖర్చు చేసినట్లుగా టాక్ వస్తోంది. తన ఆశలన్నీ ఈ హీరో మోసగాళ్ళు సినిమాపైనే పెట్టుకున్నాడు. మరి సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి. కాజల్ అగర్వాల్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది.