Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Dhanush వరుసగా రెండో తెలుగు సినిమా.. వెంకీ అట్లూరికి గ్రీన్ సిగ్నల్.. నిర్మాత ఎవరంటే!
సెకండ్ లాక్డౌన్ తర్వాత విలక్షణ నటుడు ధనుష్ మంచి జోరు మీద ఉన్నారు. తాజాగా జగమే తంత్రం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలకు ఓకే చెప్పడం దక్షిణాది చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే బాలీవుడ్లో ప్రశంసలు అందుకొన్న ధనుష్ ఇప్పుడు టాలీవుడ్లో నేరుగా తన సత్తాను చాటేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు కేవలం తమిళ డబ్బింగ్ సినిమాలకే పరిమితమైన ఈ హీరో ఇప్పుడు డైరెక్ట్గా తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్లో దర్శకుడు కార్తీక్ నారాయణ్ డైరెక్షన్లో రూపొందుతున్న ఓ చిత్రంతో బిజీగా ఉన్నారు. అయితే ఈ సందర్భంగా పలువురు తెలుగు దర్శక, నిర్మాతలతో సమావేశమై పలు కథలపై చర్చలు జరిపారనేది తాజా సమాచారం.
ఈ క్రమంలోనే కొద్ది రోజల క్రితం దర్శకుడు శేఖర్ కమ్ములతో ప్యాన్ ఇండియా సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. అంతేకాకుండా అదే ఊపులో మరో తెలుగు సినిమా దర్శకుడు వెంకీ అట్లూరికి కూడా ఓ సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సినీ వర్గాలు స్పష్టం చేశాయి. వెంకీ అట్లూరి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమాలో నటించడానికి సిద్ధమయ్యారని, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ కూడా అడ్వాన్స్గా కొంత మొత్తాన్ని ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చిత్ర యూనిట్ వెల్లడించనున్నారు.
ధనుష్ ఓకే చెప్పడంతో ప్రస్తుతం వెంకీ అట్లూరి స్క్రిప్టు వర్క్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు అని వెల్లడించారు. ఇక వెంకీ అట్లూరి విషయానికి వస్తే ఇటీవల నితిన్, కీర్తీ సురేష్తో రూపొందించిన రంగ్ దే మంచి విజయాన్ని అందుకొన్నది.
ఇక వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ నిర్మాత నాగవంశీ ఇటీవలే జెర్సీ చిత్రానికి జాతీయ అవార్డును అందుకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కల్యాణ్తో అయప్పనుమ్ కోషియమ్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు.