Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. సరిగ్గా ఐదు రోజుల్లో వీరికి డబ్బే డబ్బు
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
రంగ్ దే తర్వాత వెంకీ అట్లూరి క్రేజీ ప్రాజెక్ట్.. లాక్డౌన్లో అండగా నిలిచిన బ్యానర్లోనే..
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మాత నాగవంశీ సూర్యదేవర రూపొందించిన రంగ్ దే మూవీ రిలీజ్కు సిద్ధమైంది. మార్చి 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు వెంకీ అట్లూరి మీడియాతో మాట్లాడుతూ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చారు.
రంగ్ దే నిర్మాణ సమయంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యాన్ యూనిట్ సభ్యులకు అండగా నిలిచింది. కరోనా పరిస్థితుల వల్ల షూటింగ్ ఆగిపోవడంతో అందరికీ జీతాలు, వేతనాలు, పారితోషికం ఇచ్చింది. అలాంటి ఉన్నత విలువలు ఉన్న బ్యానర్ అది. లాక్డౌన్ తర్వాత పరిస్థితుల ప్రతికూలంగా మారిన రాజీ పడలేదు. నిర్మాత నాగవంశీ పెట్టిన ప్రతీ పైసా తెర మీద కనిపిస్తుంది అని వెంకీ అట్లూరి ఎమోషనల్ అయ్యారు.
మ్యూజిక్ మాంత్రికుడి మరో అవతారం.. నిర్మాతగా మారిన ఏఆర్ రెహ్మన్!
తన తదుపరి ప్రాజెక్ట్ కూడా సితార బ్యానర్లోనే ఉంటుంది. ఈ సినిమాను దిల్ రాజుతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా హీరో, ఇతర విషయాలు ఫైనల్ అయ్యాయి. మంచి సమయం చూసి అధికారికంగా సినిమా వివరాలు వెల్లడిస్తాం అని వెంకీ అట్లూరి తెలిపారు.