Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కరోనా క్రైసిస్ ఛారిటీ.. సినీ కార్మికుల కోసం కదిలిన కమెడియన్స్
మెగాస్టార్ చిరంజీవి తలపెట్టిన మంచి కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. లాక్ డౌన్ సమయంలో సినీ కార్మికులకు అండగ నిలబడేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీని స్థాపించి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. అంతేకాకుండా తోటీ నటీనటులను కూడా పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చాడు. చిరు పిలుపు మేరకు యంగ్ హీరోలంతా కదిలి వచ్చారు.
మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శర్వానంద్, కార్తికేయ, విశ్వకేస్న్, దిల్ రాజు లాంటి వారంతా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కింగ్ నాగార్జున కోటి రూపాయలు, దగ్గుబాటి ఫ్యామిలీ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ చారిటీ మెంబర్స్ను కూడా ప్రకటించారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా సంప్రదించడండని చిరంజీవి ట్వీట్ చేశాడు.
తాజాగా ఈ ఛారిటీకి వెన్నెల కిషోర్, సంపూర్ణేష్ బాబు విరాళాన్ని ప్రకటించారు. వెన్నెల కిషోర్ రెండు లక్షలు, సంపూర్ణేష్ బాబు లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. షూటింగ్లు లేక, పనులు దొరక్క ఇబ్బంది పడుతున్న రోజువారీ సినీ కార్మికులకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు.