Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కరోనా క్రైసిస్ ఛారిటీ.. సినీ కార్మికుల కోసం కదిలిన కమెడియన్స్
మెగాస్టార్ చిరంజీవి తలపెట్టిన మంచి కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. లాక్ డౌన్ సమయంలో సినీ కార్మికులకు అండగ నిలబడేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీని స్థాపించి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. అంతేకాకుండా తోటీ నటీనటులను కూడా పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చాడు. చిరు పిలుపు మేరకు యంగ్ హీరోలంతా కదిలి వచ్చారు.
మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శర్వానంద్, కార్తికేయ, విశ్వకేస్న్, దిల్ రాజు లాంటి వారంతా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కింగ్ నాగార్జున కోటి రూపాయలు, దగ్గుబాటి ఫ్యామిలీ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ చారిటీ మెంబర్స్ను కూడా ప్రకటించారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా సంప్రదించడండని చిరంజీవి ట్వీట్ చేశాడు.
తాజాగా ఈ ఛారిటీకి వెన్నెల కిషోర్, సంపూర్ణేష్ బాబు విరాళాన్ని ప్రకటించారు. వెన్నెల కిషోర్ రెండు లక్షలు, సంపూర్ణేష్ బాబు లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. షూటింగ్లు లేక, పనులు దొరక్క ఇబ్బంది పడుతున్న రోజువారీ సినీ కార్మికులకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు.