twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వేణు మాధవ్‌కు కన్నీటి వీడ్కోలు.. అశ్రునయాల మధ్య అంత్యక్రియలు

    |

    నవ్వుల రారాజు వేణు మాధవ్‌కు సినీ ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు. భారీగా తరలి వచ్చిన సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు ముగిసాయి. ఆయన అంత్యక్రియలు మౌలాలి హౌసింగ్ బోర్డు శ్మశాన వాటికలో నిర్వహించారు. కుటుంబ సభ్యులు వేణు దహన సంస్కరాలు నిర్వహించారు.

    గురువారం వేణు మాధవ్ ఇంటి నుంచి భౌతికకాయాన్ని ఫిలించాంబర్‌కు తరలించగా.. అక్కడ సినీ ప్రముఖులు శ్రద్దాంజలి ఘటించారు. ఆ తర్వాత ఆయన అంతిమ యాత్ర ప్రారంభమైంది. అంతకు ముందు ఫిలింఛాంబర్ మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్, మురళీ మోహన్, రాజీవ్ కనకాల, నాగబాబు, తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, జీవితా రాజశేఖర్, ఉదయభాను తదితరులు శ్రద్దాంజలి ఘటించారు.

    Venu Madhav last rites finished at Moulali of Hyderabad

    అనంతరం ప్రారంభమైన అంతిమ యాత్రలో సినీ ప్రముఖులు, ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణు మాధవ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని విషాదంలో మునిగిపోయారు.

    గత కొద్దికాలంగా కాలేయ, కిడ్ని సమస్యతో బాధపడతున్న ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన బుధవారం మధ్యాహ్నం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో సినీ, ప్రేక్షకలోకం విషాదంలో మునిగిపోయింది.

    English summary
    Comedian Venu Madhav died at Yashoda Hospital of Secunderabad. He has been under going treatment for Kidney failure and Liver related issues from few days. In this tragic occassion, MAA and Pawan Kalyan conveys deep condolence to his family. Thursday, his last rites fineshed at Moulali Housing board cremation centre.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X