Don't Miss!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వేణు మాధవ్కు కన్నీటి వీడ్కోలు.. అశ్రునయాల మధ్య అంత్యక్రియలు
నవ్వుల రారాజు వేణు మాధవ్కు సినీ ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు. భారీగా తరలి వచ్చిన సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు ముగిసాయి. ఆయన అంత్యక్రియలు మౌలాలి హౌసింగ్ బోర్డు శ్మశాన వాటికలో నిర్వహించారు. కుటుంబ సభ్యులు వేణు దహన సంస్కరాలు నిర్వహించారు.
గురువారం వేణు మాధవ్ ఇంటి నుంచి భౌతికకాయాన్ని ఫిలించాంబర్కు తరలించగా.. అక్కడ సినీ ప్రముఖులు శ్రద్దాంజలి ఘటించారు. ఆ తర్వాత ఆయన అంతిమ యాత్ర ప్రారంభమైంది. అంతకు ముందు ఫిలింఛాంబర్ మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్, మురళీ మోహన్, రాజీవ్ కనకాల, నాగబాబు, తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, జీవితా రాజశేఖర్, ఉదయభాను తదితరులు శ్రద్దాంజలి ఘటించారు.
అనంతరం ప్రారంభమైన అంతిమ యాత్రలో సినీ ప్రముఖులు, ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణు మాధవ్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని విషాదంలో మునిగిపోయారు.
గత కొద్దికాలంగా కాలేయ, కిడ్ని సమస్యతో బాధపడతున్న ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన బుధవారం మధ్యాహ్నం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో సినీ, ప్రేక్షకలోకం విషాదంలో మునిగిపోయింది.