Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వేణు మాధవ్కు కన్నీటి వీడ్కోలు.. అశ్రునయాల మధ్య అంత్యక్రియలు
నవ్వుల రారాజు వేణు మాధవ్కు సినీ ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు. భారీగా తరలి వచ్చిన సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు ముగిసాయి. ఆయన అంత్యక్రియలు మౌలాలి హౌసింగ్ బోర్డు శ్మశాన వాటికలో నిర్వహించారు. కుటుంబ సభ్యులు వేణు దహన సంస్కరాలు నిర్వహించారు.
గురువారం వేణు మాధవ్ ఇంటి నుంచి భౌతికకాయాన్ని ఫిలించాంబర్కు తరలించగా.. అక్కడ సినీ ప్రముఖులు శ్రద్దాంజలి ఘటించారు. ఆ తర్వాత ఆయన అంతిమ యాత్ర ప్రారంభమైంది. అంతకు ముందు ఫిలింఛాంబర్ మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్, మురళీ మోహన్, రాజీవ్ కనకాల, నాగబాబు, తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, జీవితా రాజశేఖర్, ఉదయభాను తదితరులు శ్రద్దాంజలి ఘటించారు.
అనంతరం ప్రారంభమైన అంతిమ యాత్రలో సినీ ప్రముఖులు, ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణు మాధవ్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని విషాదంలో మునిగిపోయారు.
గత కొద్దికాలంగా కాలేయ, కిడ్ని సమస్యతో బాధపడతున్న ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన బుధవారం మధ్యాహ్నం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో సినీ, ప్రేక్షకలోకం విషాదంలో మునిగిపోయింది.