Venu Swamy: ట్రోల్స్ చేయడం వల్లే నేను హీరో అయ్యా.. ఆకాశానికి ఎత్తారు.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్
Venuswamy: సెలబ్రిటీల జాతకాలు,పూజలు, సంచలన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. గత కొంతకాలంగా ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వినిపిస్తోంది. ముఖ్యంగా సినీ హీరోలు, హీరోయిన్లతో కలిసి పూజలు చేయడం, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా వేణు స్వామి ఒక్కసారిగా సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా మారిపోయారు. ఆయనతో పూజలు చేయించుకున్న కొంతమంది సెలబ్రిటీలు స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్నారని ప్రచారం కూడా ఉంది. ఇలా నిత్యం వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచే జ్యోతిష్యుడు వేణు స్వామి తాజాగా సోషల్ మీడియా ట్రోల్స్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే..?
ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ.. సోషల్ మీడియా, తెలుగు మీడియా కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్టేజ్ కు రావడానికి ప్రధాన కారణం.. సోషల్ మీడియానే.. మమ్మల్ని నెగటివ్గా ప్రచారం చేసిన సోషల్ మీడియా వల్లనే మేము ఈ స్థాయికి వచ్చాము. సెలబ్రిటీ కావాలంటే చాలా కష్టం. అమీర్పేట్ సెంటర్ కి వెళ్లి కుక్క మిమ్మల్ని కరిస్తే కాదు కుక్కని మీరు కలిస్తే అది సెన్సేషన్ అవుతారు. సెలబ్రిటీ అవుతారు. సోషల్ మీడియాలో సెన్సేషనల్ కావాలంటే.. చాలా కష్టం ఈరోజులలో.. అనిల్ అంబానీ లాంటి వాడు కూడా సోషల్ మీడియాలో సెలబ్రిటీ కావడానికి లక్షల కోట్లు ఖర్చులు పెడుతున్నారు అలాంటిది మాకు ప్రీ పబ్లిసిటీ వచ్చింది. ఒక సంవత్సరం నుండి మమ్మల్ని ఆకాశంలో కూర్చుండబెట్టారు. అంతకుముందు కంపేర్ చేస్తే ఇప్పుడు పరిస్థితిలో చాలా మారాయి. ఈ సందర్భంలో ఉదాహరణ చెబుతూ.. తన భార్య వీణ వాయించడానికి వెళ్తే.. తాను కూడా తోడుగా వెళ్లానని, ఆ సమయంలో పెళ్లి కొడుకు కంటే తానే ఎక్కువ ఫోటోలకు ఫోజు ఇచ్చానని వెల్లడించారు.

'ఇదంతా క్రెడిట్ తెలుగు సోషల్ మీడియాకి ఇస్తాను. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ప్రాధాన్యతిస్తా.. భగవంతుడు నన్ను ఫిక్స్ చేసి పెట్టారు. అమ్మవారి కూడా నన్ను కరుణించారు. నాకు డబ్బులు వద్దు పబ్లిసిటీ కావాలి. ఇంకా పబ్లిసిటీ వచ్చిన నేను తీసుకుంటా.. పబ్లిసిటీ అనేది ఎంత ఖర్చు పెట్టినా రాదు వాటిని రావాలి అందుకోసం కొందరు కోటా రూపాయలను ఖర్చు చేస్తున్నారు. డబ్బులకు పబ్లిసిటీకి సంబంధం లేదు. ఈ సమయంలో మరో ఉదాహరణ చెబుతూ.. మహేష్ బాబు రేంజ్ రోవర్ కార్లో వెళ్తే మహేష్ బాబుని చూస్తారా రేంజ్ రోవర్ కార్ చూస్తారా అంటూ యాంకర్ ను ప్రశ్నించారు. తప్పకుండా మహేష్ బాబుని చూస్తాం అని సమాధానం ఇవ్వగా.. అదే ఓ అలా ఒకడు రేంజ్ రోవర్ కార్ వేసుకొని బయటికి వెళ్తే మాత్రం.. రేంజ్ రోవర్ కార్నై చూస్తారు.
'ఇక్కడ నేను చెప్పేది ఒకటే ముందుగా మనకు మనం బ్రాండ్ ఫిక్స్ చేసుకోవాలి. అలాగే నా బ్రాండ్ నేను బెల్ట్ చేసుకున్న.. నా భార్య కూడా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. వేణు స్వామికి జాతకాలు చెప్పడం వస్తది కాబట్టే జాతకాలు చెప్పడం ప్రారంభించారు. సమస్యలను పరిష్కరించే సత్తా ఉంది కాబట్టి వాటిని ఛాలెంజ్గా తీసుకుంటారు. తెలుగు మీడియా వల్ల సోషల్ మీడియా వల్ల మాకు అనుకున్న దానికంటే ఎక్కువ పబ్లిసిటీ వచ్చేసింది మేము సెలబ్రిటీలం అయ్యాం .. వామాచారం కోసం సౌత్ ఇండియా రామాచారము అంటే ఇప్పుడు ఎగ్జామ్పుల్ చెప్తా ఇప్పుడు మన ఒక ఇన్సిడెంట్ జరిగింది. తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











