Don't Miss!
- News మోదీ కరుణించిన ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది, తిరుగులేని నాయకుడికి రివర్స్ గేర్ !
- Sports DC vs SRH: అందుకే ఉనాద్కత్ను పక్కనపెట్టాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
దర్శకుడు వేణు ఊడుగులకు అరుదైన గౌరవం.. మరోసారి నీది నాది ఒకే కథకు ప్రశంస!
2018లో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్న చిత్రాల్లో నీది నాదీ ఒకే కథ ఒకటి. యువ దర్శకుడు వేణు ఊడుగుల ప్రతిభకు ఈ చిత్రం అద్ధం పట్టింది. చిన్న చిత్రంగా రిలీజైన నీది నాది ఒకే కథకు ప్రేక్షకులు నీరాజనం పట్టడంతో భారీ విజయం సాధించింది. తమిళంలో కూడా డబ్బింగ్ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇలాంటి ఎన్నో ఘనతను సొంతం చేసుకొన్న చిత్రం తాజాగా మరోసారి వార్తల్ల నిలిచింది.
నీది నాది ఒకే కథ చిత్రానికి జీ టెలివిజన్ సంస్థ క్రిటిక్స్ అవార్డుతో సత్కరించింది. దర్శకుడు వేణు ఊడుగులకు బెస్ట్ అప్రిసియేషన్ డైరెక్టర్ అవార్డు, ఈ చిత్రంలో హీరోగా నటించిన శ్రీ విష్ణుకు బెస్ట్ అప్రిసియేషన్ యాక్టర్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని తెలుగు ఫిల్మీబీట్తో పంచుకొన్నారు.
నా మొదటి చిత్రం సినీ, విమర్శకుల ప్రశంసలతోపాటు అవార్డులను, రివార్డులను గెలుచుకోవడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం, అవార్డులు నాపై అదనపు బాధ్యతను పెట్టాయి అని వేణు ఊడుగుల అన్నారు.
నీది నాది ఒకే కథ చిత్రం తర్వాత ప్రస్తుతం దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా విరాటపర్వం అనే చిత్రాన్ని సెట్స్పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నది.