Don't Miss!
- News 'ఓటుకు నోటు' కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
- Finance IT News: టెక్ కంపెనీల్లో అత్యధిక జీతం ఆయనకే.. దేశీయ ఐటీ కంపెనీల్లో రికార్డు..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఫ్యాన్స్ కు సాడ్ న్యూస్ చెప్పిన విజయ్ దేవరకొండ.. పర్సనల్ ఫొటో రిలీజ్!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ రానున్న రోజుల్లో పాన్ ఇండియా మార్కెట్ ను కూడా క్రియేట్ చేసుకోబోతున్నట్లు చాలా క్లారిటీగా అర్థమవుతోంది. లైగర్ సినిమా బజ్ అయితే మాములుగా లేదుగా. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ కూడా భారీ స్థాయిలో హైప్ చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు మళ్ళీ ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే విజయ్ దేవరకొండ ఇటీవల తన పర్సనల్ ఫొటోను విడుదల చేసి సాడ్ న్యూస్ చెప్పాడు.
ఫ్యాన్స్ లో నమ్మకం..
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కరణ్ జోహార్ నిర్మాతగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరపైకి రాబోతున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అని అభిమానులు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు.
బాలీవుడ్ కూడా ఫ్యాన్ ఫాలోవర్స్
విజయ్ దేవరకొండకు కేవలం సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ కూడా విజయ్ దేవరకొండ తో నటించాలానే ఉన్నట్లు ఓపెన్ గానే తెలియజేశారు. అందులో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కూడా ఉంది. అయితే విజయ్ దేవరకొండ సినిమా కోసం కేవలం అభిమానులు మాత్రమే కాకుండా చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఎదురు చూస్తున్నారు.
మరోసారి బ్రేక్..
హఠాత్తుగా లైగర్ సినిమా షూటింగ్ మరోసారి ఆగిపోయినట్లు విజయ్ దేవరకొండ అధికారికంగా తెలియజేశాడు. మొన్నటి వరకు శరవేగంగా కొనసాగిన ఈ సినిమా షెడ్యూల్ లో ప్రపంచం బాక్సింగ్ మైక్ టైసన్ కూడా నటించాడు. యూఎస్ నిర్వహించిన ఆ షెడ్యూల్ ఎంతో ఆసక్తిగా సాగింది అని దర్శకుడు పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ కూడా తెలియజేశారు. మరొక చివరి షెడ్యూల్ తో బిజీగా ఉన్న సమయంలో ఆ సినిమాపై కరోనా ప్రభావం పడింది.
ఫొటో వైరల్..
ప్రస్తుత పరిస్థితిలో సినిమా షూటింగ్ ను కొనసాగించలేక చిత్ర యూనిట్ సభ్యులు హైదరాబాద్ వచ్చేశారు. ఇక విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా తన పెంపుడు శునకం తో కూర్చుని చాలా సైలెంట్ గా ఉన్నట్లు కనిపించాడు. మరోసారి కరోనా వేవ్ తో షూటింగ్ క్యాన్సిల్ అయినట్లు చెబుతూ... మళ్ళీ ఇంట్లోనే చిల్ అవుతున్నట్లు పేర్కొన్నారు.
Recommended Video
రిలీజ్ డేట్ ఫిక్స్
లైగర్ సినిమాలో విజయ్ ఒక బాక్సర్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక సినిమాకు సంబంధించిన అన్ని పనులను త్వరలోనే ఫినిష్ చేసుకొని ప్రమోషన్ డోస్ పెంచాలని చూస్తున్నారు. ఇక సడన్ గా కరోనా వలన షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. మరి మిగిలిన షూట్ ను ఎప్పుడు ఫినిష్ చేస్తారో చూడాలి.