Don't Miss!
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- News డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా?: ఉచితాలపై వెంకయ్య నాయుడు
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
సుకుమార్ ప్రాజెక్ట్ పై విజయ్ దేవరకొండ క్లారిటీ.. పుష్ప 2 తర్వాత ర్యాంపేజ్ అంటూ..
టాలీవుడ్ రౌడి స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ టాలెంటెడ్ హీరో మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేస్తుండడంతో అభిమానుల్లో అంచనాల స్థాయి అకాశాన్ని దాటేసింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఆ సినిమా అనంతరం విజయ్ సుకుమార్ తో వర్క్ చేయబోతున్నాడు. ఇక ఆ ప్రాజెక్ట్ పై కూడా విజయ్ ఒక క్లారిటీ ఇచ్చేశాడు.
పాన్ ఇండియా ఫార్మాట్
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలు చాలా వరకు పాన్ ఇండియా ఫార్మాట్ లోనే సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అంచనాలకు ఏ మాత్రం తక్కువ కాకుండా వీలైనంత వరకు సౌత్ నార్త్ లో సినిమాలను భారీ స్థాయిలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక దర్శకులు కూడా అదే తరహాలో ముందుకి సాగుతున్నారు.
బ్యాక్ గ్రౌండ్ లేకుండా
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకున్న దేవరకొండ విజయ్ చూస్తుండగానే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి పాన్ ఇండియా రేంజ్ వరకు వచ్చేశాడు. ఇక తప్పకుండా అతను అంచనాలకు తగ్గట్టుగా పాన్ ఇండియా రూట్లో కూడా మంచి సక్సెస్ అందుకుంటాడు అని అర్ధమవుతోంది.
ఫస్ట్ గ్లింప్స్ తోనే
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను బ్రకే చేసేలా ఉంటుందని ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది.
పూరి తరువాత సుకుమార్ తో
అయితే మిగతా స్టార్ హీరోల మాదిరిగానే విజయ్ దేవరకొండ కూడా తన తదుపరి సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే కొనసాగించనున్నట్లు ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు. పూరి జగన్నాథ్ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో మరో భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
బర్త్ డే విషెస్ అందిస్తూ..
మంగళవారం సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ అందిస్తూ విజయ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా వుండాలని మొరుకుంటున్నాను అంటూ.. మీతో సినిమా చేసేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను అని విజయ్ వివరణ ఇచ్చారు.
2023లో ద ర్యాంపేజ్
అంతే కాకుండా సుకుమార్ ఇటీవల దిగిన ఒక ప్రత్యేకమైన ఫొటోను కూడా సుకుమార్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇక 2021లో ద రైస్, 2022 లో ది రూల్, 2023లో ద ర్యాంపేజ్ అని తన ప్రాజెక్ట్ పై కూడా ఒక క్లారిటీ ఇచ్చేశాడు. అంటే వీరి కలయికలో వచ్చే ఏడాది సినిమా రాబోతున్నట్లు ఒక వివరణ ఇచ్చేశాడు. మరి సుకుమార్ విజయ్ తో అనుకున్న సమయానికి సినిమాను ఫినిష్ చేస్తాడో లేదో చూడాలి.