Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
బాలీవుడ్ బ్యూటీని హైదరాబాద్ తీసుకొస్తున్న విజయ్: అదిరిపోయే ప్లాన్ వేసిన డైరెక్టర్
కెరీర్ ఆరంభంలోనే చిన్న చిన్న పాత్రల్లో నటించి.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. మొదటి సినిమాలో డీసెంట్గా కనిపించిన అతడు.. ఆ తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి'లో మాత్రం వైలెంట్గా దర్శనమిచ్చాడు. అదే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. అనంతరం వరుస విజయాలతో స్టార్గా ఎదిగిపోయాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. ఇలాంటి సమయంలో ఏకంగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ఈ మూవీ గురించి ఓ అప్డేట్ వచ్చింది.
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రమే 'లైగర్'. పాన్ ఇండియా రేంజ్తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ముంబై నగరంలో జరుగుతోంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంతో ఇది రూపొందుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల చివరి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరగబోతుందట. ఇక్కడ హీరో, హీరోయిన్ల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్లను చిత్రీకరించడంతో పాటు యాక్షన్ పార్టును కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. అలాగే, ఓ పాటను సైతం తీయబోతున్నారని అంటున్నారు.
విజయ్ దేవరకొండ కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'లైగర్' సినిమాను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీన్ని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.