Don't Miss!
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మరో సినిమాతో విజయ్ దేవరకొండ రెడీ: కొత్త దర్శకుడితో అదిరిపోయే ప్లాన్
క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా మారాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న అతడు.. ఆ వెంటనే వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో తనలోని మరో యాంగిల్ చూపించి స్టార్గా ఎదిగిపోయాడు. ఇక, అప్పటి నుంచి హిట్లు ఫ్లాపులతో తన కెరీర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలను లైన్లో పెట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడి కొత్త సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
విజయ్ దేవరకొండ కొన్నేళ్ల క్రితం నిర్మాతగానూ మారిన విషయం తెలిసిందే. ఇందుకోసం కింగ్ ఆఫ్ ద హిల్స్ అనే బ్యానర్ను సైతం స్థాపించాడు. ఇప్పటికే ఈ బ్యానర్లో 'మీకు మాత్రమే చెప్తా' అనే సినిమాను నిర్మించాడు. ఇది ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ ఉత్సాహంతోనే తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో 'పుష్పక విమానం' అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఇది ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి ఈ చిత్రం పట్టాలపై ఉండగానే విజయ్ దేవరకొండ తన బ్యానర్లో మూడో సినిమాను కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ దేవరకొండ నిర్మాతగా మూడో సినిమాను కూడా పట్టాలెక్కించబోతున్నాడట. దీనిని పృథ్వీసేనా రెడ్డి అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్నాడని తెలుస్తోంది. ఇక, ఇందులో అందరూ కొత్త నటీనటులే చేస్తున్నట్లు తెలిసింది. లాక్డౌన్ పూర్తయిన వెంటనే దీన్ని అధికారికంగా ప్రకటించడంతో పాటు వెంటనే షూటింగ్ ప్రారంభించబోతున్నారట. ఇదిలా ఉండగా.. విజయ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' అనే మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్లో రాబోతున్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది.