Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
విజయ్ దేవరకొండ కోసం పూరీ జగన్నాథ్ డేరింగ్ స్టెప్: మొత్తం మార్చేస్తున్నాడట
కెరీర్ ఆరంభంలోనే భారీ హిట్లను అందుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు రౌడీ గాయ్ విజయ్ దేవరకొండ. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం అతడు విజయాన్ని అందుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా సక్సెస్ బాట పట్టాలని పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్తో 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్తో రూపొందుతోన్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంతో వస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది.
బెడ్ మీద హాట్ హాట్ ఫోజులతో కవ్విస్తోన్న పూనమ్
'లైగర్' మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. పాన్ ఇండియా చిత్రం కావడంతో ఇందులో బాలీవుడ్ నటులు ఎక్కువగా ఉన్నారు. దీంతో చిత్రీకరణను ముంబైలోనే జరుపుతున్నారు. అయితే, కరోనా కారణంగా పోయిన ఏడాది ఒకసారి.. ఇప్పుడు మరోసారి షూటింగ్కు బ్రేక్ పడింది. దీంతో సినిమా విడుదలపై దాని ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ షూట్ను ముంబై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని పూరీ జగన్నాథ్ అండ్ టీమ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
బ్యాలెన్స్ ఉన్న 'లైగర్' షూటింగ్ను మొత్తాన్ని సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాలని యూనిట్ భావిస్తుందట. ఇందులోనే క్లైమాక్స్ పార్ట్ కూడా ఉంటుందని అంటున్నారు. ముంబైలో షూటింగ్లకు పర్మీషన్లు వచ్చే పరిస్థితులు లేని కారణంగానే హైదరాబాద్కు మార్చుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు యూనిట్ గతంలో ప్రకటించింది.