twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Liger అసలైన హవా మొదలైంది.. ఆ స్టార్ దర్శకుడితో బిగ్గెస్ట్ ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ!

    |

    టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో మొదటి సారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై అంచనాలు అయితే మాములుగా లేవు. తప్పకుండా లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ప్రేక్షకులలో ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కూడా మొదలు పెట్టేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధమయ్యారు. ఇక మొత్తానికి హై రేంజ్ లోనే లైగర్ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

    మొదటి పాన్ ఇండియా మూవీ

    మొదటి పాన్ ఇండియా మూవీ


    రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పటివరకు ఒక లెక్క ఇకనుంచి రాబోయే సినిమాలు మరో లెక్క అనే తరహాలో ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే అతనికి ఇతర ఇండస్ట్రీలో ఒక మంచి క్రేజ్ ఏర్పడింది. ఒక్క సినిమా కూడా అక్కడ విడుదల చేయక పోయినప్పటికీ కూడా హిందీ ఆడియన్స్ కు విజయ్ దేవరకొండ డబ్బింగ్ సినిమాలతోనే ఎక్కువగా ఆకట్టుకున్నాడు. కాబట్టి అతని మొదటి పాన్ ఇండియా మూవీ భారీస్థాయిలో క్రేజ్ అందుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

     హీరోపై నమ్మకం

    హీరోపై నమ్మకం

    విజయ్ దేవరకొండ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో ఏదో కొత్త కంటెంట్ ఉంటే గానీ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని ప్రేక్షకుల్లో గట్టి నమ్మకం అయితే ఉంది. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు అనగానే ఒక్కసారిగా ఆ కాంబినేషన్ పై అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. తప్పకుండా సినిమా అయితే పూర్తి స్థాయిలో సంతృప్తి పరుస్తుంది అని అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    ప్రమోషన్స్ స్టార్ట్

    ప్రమోషన్స్ స్టార్ట్

    అసలైతే లైగర్ సినిమాను గత ఏడాది డిసెంబర్ లోనే విడుదల చేయాల్సింది. కానీ కరోనా పరిస్థితుల ప్రభావం వలన సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి కొన్ని నెలల క్రితమే లైగర్ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. కాబట్టి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కూడా మొదలు పెట్టాలి అని డిసైడ్ అయ్యారు.

    ఆ టాక్ షో ద్వారా..

    ఆ టాక్ షో ద్వారా..


    లైగర్ సినిమాను ఆగస్టు 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మొదట్లోనే బాలీవుడ్ లో అందరిని ఆకట్టుకునే విధంగా ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దర్శకుడు కరణ్ జోహార్ తో కాఫీ విత్ కరణ్ అనే టాక్ షో ద్వారా లైగర్ సినిమాను ప్రమోట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Top 10 Pan India Stars... నంబర్‌వన్ స్థానం కోసం లొల్లి #Tollywood | Telugu Filmibeat
    పూరి, కరణ్ జోహార్ కాంబినేషన్

    పూరి, కరణ్ జోహార్ కాంబినేషన్


    లైగర్ సినిమాకు కరణ్ జోహార్ కూడా మరొక నిర్మాతగా ఉన్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాకు డైరెక్షన్ చేయడమే కాకుండా ప్రొడక్షన్ లో కూడా ఒక పాట్నర్ గా ఉన్నారు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని నమ్మకం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అనన్య పాండే మెయిన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు.

    English summary
    Vijay Devarakonda special plan with karan johar talk show for liger promotion
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X