Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పెళ్లి చూపులు సమయంలోనే మాటిచ్చా.. అందుకే సంపాదించిందంతా ఖర్చు చేశా.. విజయ్ దేవరకొండ
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కెరీర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తూ బిజినెస్ రంగంలో కూడా సత్తా చాటుతున్నాడు విజయ్. ఇప్పటికే రౌడీ పేరిట బట్టల వ్యాపారం చేస్తున్న ఆయన 'మీకు మాత్రమే చెప్తా' సినిమాతో నిర్మాత అవతారమెత్తారు. సినిమా నిర్మాణంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా షూటింగ్ పూర్తిచేశారు. నవంబర్ 1న విడుదల కానున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన విజయ్ దేవరకొండ ఈ సినిమాకు సంబంధించిన పలు విశేషాలు పంచుకున్నారు. తాను 'పెళ్లి చూపులు' సినిమా చేస్తున్న సమయంలోనే డైరెక్టర్ షమ్మీర్ సుల్తాన్ తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూశానని, వాటికి అట్రాక్ట్ అయి అప్పుడే ఆయనకు సినిమా చేస్తాననే మాటిచ్చానని తెలిపారు. ఆయన చెప్పిన 'మీకు మాత్రమే చెప్తా' కథ బాగా నచ్చడంతో తాను సంపాదించిన దాంట్లో ఎక్కువ మొత్తం సొమ్ము ఈ సినిమాపై వెచ్చించానని విజయ్ దేవరకొండ చెప్పారు. టీమ్ అంతా కష్టపడి నటించారని, ఆడియన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారనే నమ్మకముందని విజయ్ అన్నారు.
షమీర్ సుల్తాన్ దర్శకత్వం వహించిన 'మీకు మాత్రమే చెప్తా' చిత్రాన్ని విజయ్ దేవరకొండ తన సొంత నిర్మాణ సంస్థ 'కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్' పతాకంపై నిర్మించాడు. తనను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ను ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా పరిచయం చేస్తుండటం విశేషం. న్యూ ఏజ్ ఫన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నటించింది.