Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
విలన్గా నటించడం లేదు.. పుష్పపై క్లారిటీ ఇచ్చిన విక్రమ్
సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ విక్రమ్ నటిస్తున్నారనే వార్త దక్షిణాది మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. డేట్స్ సమస్య కారణంగా విజయ్ సేతుపతి ఈ చిత్రం నుంచి తప్పుకొన్నారని, ఆయన స్థానంలో విక్రమ్ ఆ పాత్ర చేయడానికి ఒప్పుకొన్నారనే విషయం వైరల్ అయింది.
అయితే పుష్ప చిత్రంలో విక్రమ్ నటిస్తున్నారనే వార్తలో వాస్తవం లేదు. అందంతా ఊహాగానాలే. ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించడం లేదు అంటూ విక్రమ్ సన్నిహితులు వెల్లడించారు.
కరోనావైరస్ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఈ చిత్రం షూటింగ్ను నవంబర్ 12వ తేదీన ప్రారంభించారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న షూటింగులో పాల్గొన్నారు. ప్రస్తుతం ఏపీలోని మారేడుమిల్లి అడవిలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ముట్టమ్శెట్టి మీడియా నిర్మిస్తున్నది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2021 ప్రథమార్థంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.