Don't Miss!
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- News Lok Sabha Election 2024: 102 సీట్లలో తొలి దశ పోలింగ్ పూర్తి- దాదాపు 60 శాతం ఓటింగ్..!
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
విలన్గా నటించడం లేదు.. పుష్పపై క్లారిటీ ఇచ్చిన విక్రమ్
సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ విక్రమ్ నటిస్తున్నారనే వార్త దక్షిణాది మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. డేట్స్ సమస్య కారణంగా విజయ్ సేతుపతి ఈ చిత్రం నుంచి తప్పుకొన్నారని, ఆయన స్థానంలో విక్రమ్ ఆ పాత్ర చేయడానికి ఒప్పుకొన్నారనే విషయం వైరల్ అయింది.
అయితే పుష్ప చిత్రంలో విక్రమ్ నటిస్తున్నారనే వార్తలో వాస్తవం లేదు. అందంతా ఊహాగానాలే. ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించడం లేదు అంటూ విక్రమ్ సన్నిహితులు వెల్లడించారు.
కరోనావైరస్ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఈ చిత్రం షూటింగ్ను నవంబర్ 12వ తేదీన ప్రారంభించారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న షూటింగులో పాల్గొన్నారు. ప్రస్తుతం ఏపీలోని మారేడుమిల్లి అడవిలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ముట్టమ్శెట్టి మీడియా నిర్మిస్తున్నది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2021 ప్రథమార్థంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.