Don't Miss!
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Lifestyle పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పవన్, బండ్ల గణేష్ ప్రాజెక్ట్.. ఆ ఇద్దరి దర్శకుల్లో ఎవరో ఒకరు?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నాను అని ఎట్టకేలకు నిర్మాత బండ్ల గణేష్ స్పెషల్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా పవన్ తో సినిమా చేయాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సీనియర్ నటుడు ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ అయితే అందుకున్నాడు గాని ఎలాంటి దర్శకుడిని లైన్ లో పెడతాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.
టెంపర్ సినిమా తరువాత గణేష్ మళ్ళీ సినిమా చేయలేదు. ఆ మధ్య రాజకీయాలు అంటూ కాస్త హడావుడి చేసి మళ్ళీ తన రెగ్యులర్ బిజినెస్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ తో సినిమా ఎనౌన్స్ చేసి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. అయితే వీరి సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకుడిగా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. అలాగే మరో డైరెక్టర్ కిషోర్ కుమార్ పార్ధసాని కూడా రేసులో ఉన్నట్లు టాక్.
ఇక పూరి జగన్నాథ్ తో బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత మరో సినిమా కూడా చేయాలని అనుకున్నాడు. కానీ పవన్ పాలిటిక్స్ లో బిజీ కావడం వల్ల ఆ కాంబో సెట్టవ్వలేదు. ఇక ఇన్నాళ్లకు బండ్ల గణేష్ మళ్ళీ సెట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ కూడా అందుబాటులో ఉన్నాడు. మరి ఫైనల్ గా ఎవరు ఫిక్స్ అవుతారో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.