Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ధృవ సీక్వెల్.. రామ్ చరణ్, సురేందర్ రెడ్డి మళ్ళీ కలవబోతున్నారా?
బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ అనంతరం రామ్ చరణ్ 2016లో చేసిన ధృవ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ మొదటి తమిళ్ రీమేక్ అదే. తమిళ్ లో జయం రవి హీరోగా తని ఒరువన్ గా మోహన్ రాజా ఆ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇక తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ధృవ బాక్సాఫీస్ వద్ద 85కోట్లకు పైగా వసూళ్లను అందుకొని చరణ్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది.
ఇక అలాంటి సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ ని రెడీ చెయ్యాలని ప్లాన్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తని ఒరువన్ సీక్వెల్ కోసం జయం రావి చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. సరైన కథ సెట్టయినప్పుడు ఎనౌన్స్ చేస్తామని అన్నాడు. ఇక ఆయన సోదరుడు దర్శకుడు మోహన్ రాజా మొత్తానికి ఒక కథను సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సారి ఇంటర్నేషనల్ లెవెల్లో కథను డెవలప్ చేసినట్లు టాక్.
2021జనవరిలో ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట. తమిళ్ లో సీక్వెల్ న్యూస్ రాగానే తెలుగులో కూడా ధృవ సీక్వెల్ పై రూమర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ RRR సినిమాతో పాటు, మెగాస్టార్ ఆచార్య సినిమాను చేస్తున్నాడు. ఆ తరువాత ఏ ప్రాజెక్టు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఒకట్రెండు కథలు రెడీగా ఉన్నప్పటికి చరణ్ ఇంకా ఫైనల్ డిసిషన్ తీసుకోలేదు. ఇక ఇప్పుడు తని ఒరువన్ కథకు సీక్వెల్ రెడీ అవుతోంది కాబట్టి ధృవ సీక్వెల్ ని కూడా సెట్స్ పైకి తెస్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.