Don't Miss!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
మంచు లక్ష్మీతో విశ్వక్ సేన్.. ఆహా అనిపిస్తున్నారుగా!
తెలుగు భాష మీద దాదాపు అన్ని ఓటీటీ సంస్థలు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి.. ఏకంగా అల్లు అరవింద్ అయితే తెలుగులో మొట్టమొదటి ఓటీటీ అంటూ ఆహా సంస్థను నెలకొల్పిన సంగతి కూడా తెలిసిందే. ఈ సంస్థ నుంచే లక్ష్మీ మంచు డిజిటల్ మీడియాలో సందడి చేయనుంది. తెలుగు నెంబర్ వన్ ఓటీటీగా మారిన ఆహా నుండి కేవలం సినిమాలే కాదు.. స్పెషల్ షోస్ కూడా గట్టిగా ప్లాన్ చేశారు. ఇప్పటికే సమంత అక్కినేని తో సామ్ జామ్ అనే టాక్ షో ని సక్సెస్ చేసిన ఆహా వారు ఇప్పుడు మంచు లక్ష్మి హోస్ట్ గా ఆహా భోజనంబు అనే వంటల ప్రోగ్రాం మొదలు పెట్టింది.
వకీల్ సాబ్ కి తప్పని తిప్పలు.. టీవీలో వచ్చినా వదల్లేదు, ఏమవుతుందో?
ఈ సారి రొటీన్కు భిన్నంగా ఈ వంట కార్యక్రమానికి ఆమె యాంకర్ గా వ్యవహరించనుండటం విశేషం. మొట్టమొదటి తెలుగు ఓటీటీ 'ఆహా' లో ఆసక్తికరమైన ఈ టాక్ షో ప్లాన్ చేశారు. సాధారణంగా టాక్ షో అంటే సెలబ్రిటీలు వచ్చి మాట్లాడి వెళ్లిపోతారు. కానీ మంచు లక్ష్మి మాత్రం సదరు సెలబ్రిటీలతో వంటలు చేయిస్తూ వారితో మాట్లాడించనుంది.
బ్రహ్మోత్సవం డిజాస్టరే, ఒప్పుకున్న అడ్డాల.. కానీ ఫెయిల్ అవ్వలేదట!
ప్రకాశ్ రాజ్, విష్ణు మంచు, అఖిల్ అక్కినేని, రానా దగ్గుబాటి, రకుల్ ప్రీత్ సింగ్, తరుణ్ భాస్కర్, ఆనంద్ దేవరకొండ, విష్వక్సేన్ వంటి స్టార్స్ ఈ షోలో పాల్గొనబోతున్నారని ముందు నుంచే ప్రచారం జరగగా ఇప్పుడు మొదటి ఎపిసోడ్ స్ట్రీమ్ కావడానికి సిద్దమయింది. 'ఆహా భోజనంబు' పేరుతో రూపొందిన ఈ షోలో సెలబ్రిటీలు రుచికరమైన వంటకాలను వండుతూ మంచు లక్ష్మీతో వంటలపై తమకున్న ప్రేమను తెలియజేస్తూ తమ పర్సనల్ సంగతులు కూడా తెలియజేస్తారు. 'ఆహా భోజనంబు' కార్యక్రమం టాక్ షోలలో ఒక సరి కొత్త ఫార్మేట్ అనే చెప్పాలి. టాక్ షోస్ చేయడంలో లక్ష్మీకి మంచి అపారమైన అనుభవం ఉన్న నేపథ్యంలో అందరిలోనూ ఈ షో మీద ఆసక్తి నెలకొంది.