Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నిర్మాతగా మారిన వివేక్ ఒబెరాయ్.. సుస్మితా రాయ్ సోదరుడు హీరోగా మూవీ
బాలీవుడ్లో హీరోగా విభిన్నమైన నటనను ప్రదర్శించిన వివేక్ ఒబెరాయ్ నిర్మాతగా అవతారం ఎత్తారు. ప్రముఖ నటి, మాజీ విశ్వసుందరి సుస్మిత సేన్ సోదరుడు రాజీవ్ సేన్ హీరోగా 'ఇతి - కెన్ యూ సాల్వ్ యువర్ ఓన్ మర్డర్' అనే చిత్రాన్ని తెరకెక్కించాలనే ప్లాన్తో ముందుకొచ్చారు. ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ను కూడా రిలీజ్ చేసి ఆకట్టుకొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2020 లోపు ఎప్పుడైనా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి.
మందిరా ఎంటర్టైన్మెంట్, ఒబెరాయ్ మెగా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా అందించే ఈ చిత్రానికి విశాల్ మిశ్రా దర్శకత్వం వహించనున్నారు. ఎన్నో చిత్రాల విజయాలకు వెన్నుముకగా నిలిచిన ప్రేర్నా వీ అరోరా క్రియేటివ్ విభాగాలకు సహకారం అందిస్తారు.
నిర్మాతగా మారిన వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. విశాల్ చెప్పిన పాయింట్ వెంటనే నచ్చేసింది. దాంతో ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాలని వెంటనే నిర్ణయం తీసుకొన్నారు. ప్రేర్నా, టీమ్ మందిరా, గిరిష్ జోహర్ లాంటి వారితో కలిసి పనిచేయడం నిజంగా సంతోషం కలిగిస్తున్నది. ఈ ప్రయాణం మరిచిపోలేనటువంటి అనుభూతిని ఇస్తుందని భావిస్తున్నాను అని వివేక్ ఒబేరాయ్ అన్నారు.
కొత్తగా ఉండే కాన్సెప్ట్ మూవీస్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతాయని బలంగా నమ్ముతాను. సరికొత్త థ్రిల్లర్ జానర్ అందర్నీ ఆకట్టుకొంటుందనే నమ్మకం ఉంది. ప్రేర్నా వీ అరోరా మంచి అభిరుచి ఉన్న నిర్మాత. బాక్సాఫీస్ వద్ద ఘనమైన రికార్డు ఉన్న ప్రొడ్యూసర్ అని దర్శకుడు, రచయిత విశాల్ మిశ్రా అన్నారు.