Don't Miss!
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఆ హీరోలిద్దరికి కథలు రెడీ చేస్తున్న వివి వినాయక్!
వివి వినాయక్ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్. వివి వినాయక్ దర్శత్వంలో ఒక్కసారి నటిస్తే తమ మాస్ ఇమేజ్ పెరుగుతుందని హీరోలు భావించేవారు. పక్కా కమర్షియల్ అంశాలతో సినిమాలు రూపొందించి హిట్ కొట్టడం వివి వినాయక్ ప్రత్యేకత. గతంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్, నితిన్ లాంటి హీరోలందరి మాస్ ఇమేజ్ పెంచింది ఈ దర్శకుడే. చిరంజీవి, బాలయ్యతో కూడా విమానాయక్ సినిమాలు చేశారు. కానీ ఖైదీ నెం 150 మినహా ఇటీవల వినాయక్ కు సరైన విజయం లేదు. అది కూడా రీమేక్ చిత్రం కావడంతో హిట్ క్రెడిట్ వివి వినాయక్ కు దక్కలేదు.
ఇదిలా ఉండగా వివి వినాయక్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాల కోసం కసరత్తులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇద్దరు సీనియర్ హీరోలతో వివి వినాయక్ సినిమాలు చేయాలని భావిస్తున్నాడట. వివి వినాయక్, గోపి మోహన్ తో కలసి బాలయ్య, వెంకటేష్ ల కోసం కథలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ ఇద్దరి హీరోలలో వినాయక్ ముందుగా ఎవరితో చిత్రాన్ని తెరకెక్కిస్తారనే విషయంలో క్లారిటీ లేదు.
వెంకటేష్ ప్రస్తుతం వెంకీ మామ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రినాధరావు నక్కినకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య ఎన్నికల తర్వాత బోయపాటి చిత్రంతో బిజీ కాబోతున్నాడు. వీరిద్దరిలో ముందుగా వినాయక్ కు ఎవరు ఓకే చెబుతారో వేచి చూడాలి.