Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
కొత్త అడుగు వేసిన వైజయంతీ మూవీస్.. అదిరిపోయే అవకాశం
ప్రస్తుతం నిర్మాణ సంస్థలన్నీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కరోనా వైరస్, లాక్డౌన్ వచ్చి ప్రజల జీవన పరిస్థితులను ఎన్నో రకాలుగా మార్చేశాయి. ముఖ్యంగా అందరికీ ఓటీటీ బాగా అలవాటు అయింది. దాదాపు ఏడెనిమిది నెలలు థియేటర్లకూ దూరంగా ఉండటం వల్ల అందరూ కూడా ఓటీటీనే ఆశ్రయించారు. కొత్త కాన్సెప్ట్లు, కొత్త కథలు, కొత్త ఫ్లాట్ఫాంలతో ప్రేక్షకులను మెప్పించేందుకు దర్శన నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టు నిర్మాణ సంస్థలు కూడా సన్నద్దమవుతున్నాయి.
వెబ్ సిరీస్లో, వెరైటీ షోలు, కొత్త కథలను ప్రోత్సహిస్తున్నారు. అందుకే వైజయంతీ మూవీస్ కూడా ఓ అడుగు ముందుకు వేసినట్టు కనిపిస్తోంది. ఆ బ్యానర్లో ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా వారు చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఊర్లోనే షూటింగ్.. ఆ ఊరి ప్రజలే యాక్టర్స్ అంటూ క్యాస్టింగ్ కాల్ను ప్రకటించారు. మొత్తానికి నటన మీద ఆసక్తి ఉన్న వాళ్లకు ఇది మంచి అవకాశంలానే కనిపిస్తోంది.
ఒక చిన్న ఆడిషన్, మీ పెద్ద ఊరిలో, మా కొత్త షో కోసం అంటూ క్యాస్టింగ్ కాల్ కోసం ప్రకటన ఇచ్చారు. వైజయంతీ మూవీస్లొ భాగంగా ఎర్లీ మన్సూట్ టేల్పై రాబోతోన్న ఈ షో కోసం క్యాస్టింగ్ కాల్ ప్రకటన ఇచ్చారట. అయితే ఇది రాజమండ్రి చుట్టు పక్కల ఉన్న ప్రజలకు మాత్రమే అని తెలుస్తోంది. ఏది ఏమైనా వైజయంతీ మూవీస్ బ్యానర్ నుంచి కొత్తగా రాబోతోందని తెలుస్తోంది. మరి ఈ షో ఎలా ఉంటుందో చూడాలి. ఆహాలో ఇప్పటికే సమంత సామ్ జామ్ బాగానే క్లిక్ అయింది.