Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
దేవీ శ్రీ ప్రసాద్తో బ్రేకప్.. చిరు, కొరటాల మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు తెరపై తిరుగులేని హీరోగా పేరొందిన నటుడు. ఈయనకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే చిరంజీవిని అప్పట్లోనే సుప్రీమ్ హీరో అనేవారు. అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న ఈ స్టార్ హీరో.. రెండు సంవత్సరాల క్రితం సెకెండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించారు. 'ఖైదీ నెంబర్ 150'తో తన కమ్ బ్యాక్ను ఘనంగా చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. దాని తర్వాత 'సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఈ ఉత్సాహంతో మరో సినిమాను మొదలు పెట్టబోతున్నారాయన. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..? పూర్తి వివరాల్లోకి వెళితే..
అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు
‘సైరా' షూటింగ్ జరుగుతుండగానే టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీనికి కూడా చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. మ్యాట్నీ మూవీస్ సంస్థ సహా నిర్మాతగా వ్యవహరించనుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే చిత్ర రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇక్కడ కూడా మెసేజ్ ఇచ్చేస్తాడట
తన సినిమాల్లో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉండేలా చూసుకుంటాడు డైరెక్టర్ కొరటాల శివ. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాల్లోనూ ఇదే తరహాను ఫాలో అయ్యాడు. ఇప్పుడు చిరంజీవితో చేసే సినిమాలోనూ ఓ సందేశాన్ని ఇవ్వబోతున్నాడట. ఇందులో దేవాదాయ భూములకు సంబంధించిన అంశాలను చూపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఆ రెండూ పవర్ఫుల్ రోల్సే
ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తన కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150'లో సైతం ఆయన డబుల్ రోల్ చేశారు. ఇక, కొరటాల సినిమాలోనూ అది రిపీట్ చేయబోతున్నారని సమాచారం. ఇందులో చిరు తండ్రి, కొడుకుగా కనిపించబోతున్నారట. ఈ రెండు పాత్రలూ ఎంతో పవర్ఫుల్గా ఉంటాయని టాక్.
కుర్ర హీరోలను దాటేసిన చిరు
ఈ సినిమాను రామ్ చరణ్తో పాటు మ్యాట్నీ మూవీస్ సంస్థ కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రెండు నిర్మాణ సంస్థలు పాలు పంచుకోవడంతో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తారని అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమా కోసం చిరు రెమ్యూనరేషన్ కింద కొన్ని ఏరియాల రైట్స్ తీసుకుంటున్నారని ఇటీవల ఓ వార్త బయటకు వచ్చింది. వీటి విలువ రూ. 50 కోట్లు ఉంటుందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
మొదటిది కాదు.. ఇప్పడు మారింది
ఈ సినిమాలో చిరంజీవి డుయల్ రోల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ రెండు పాత్రల పేర్లు ‘గోవింద.. ఆచార్య' అని అందుకే ఈ సినిమా టైటిల్ అదే పెడుతున్నారని వార్తలు వచ్చాయి. ఈ పేరులోనే పోస్టర్ కూడా విడుదలైంది. అయితే, తాజాగా ఈ సినిమా టైటిల్ అది కాదని ఓ వార్త బయటకు వచ్చింది. ప్రస్తుత రిపోర్టులను బట్టి ఈ సినిమా అసలు టైటిల్ ‘గోవిందా హరి గోవింద' అని సమాచారం. ప్రస్తుతం ఉన్నది వర్కింగ్ టైటిలేనని అంటున్నారు.
Recommended Video
దేవీ శ్రీ ప్రసాద్ను ఎందుకు తీసుకోలేదు
ఈ సినిమాకు మణిశర్మను మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నరన్న విషయం తెలిసిందే. వాస్తవానికి కొరటాల దర్శకత్వం వహించిన ప్రతి సినిమాకూ దేవీ శ్రీ ప్రసాదే సంగీతం అందించాడు. ఈ సినిమాకు అతడిని తీసుకోకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అనుకున్నారు. కానీ, దీని వెనుక కారణం గురించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. హిట్ కాంబినేషనే అయినప్పటికీ కొంచెం గ్యాప్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే కొరటాల దేవీని తీసుకోలేదనేది ఆ వార్త సారాంశం. అదే సమయంలో మణిశర్మ - చిరుది హిట్ కాంబినేషన్ కావడంతో ఆయన వైపు మొగ్గు చూపారని టాక్.