వైసీపీ అధినేత డైరెక్షన్.. శ్రీరెడ్డి యాక్టింగ్.. సారీ చెప్పినా అరెస్ట్‌కే లోకేష్ మొగ్గు!

తెలుగులో వివాదాస్పద సినీ నటి, యూట్యూబర్ శ్రీరెడ్డి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నట్టు కనిపిస్తున్నది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ వైఎస్ వీరాభిమాని చెలరేగిపోయి లోకేష్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నాగబాబు లాంటి ప్రముఖులపై నోటికి వచ్చినట్టు బూతుల పర్వం కొనసాగించింది. అయితే గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో పోస్టుల పెట్టిన వారిని అరెస్ట్ చేస్తుండటం సంచలనం రేపుతున్నది. ఈ అరెస్టుల పర్వంలో శ్రీరెడ్డి, రాంగోపాల్ వర్మ లాంటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే శ్రీరెడ్డికి సంబందించిన వివాదంలోకి వెళితే..

వైస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో శ్రీరెడ్డి ఎంతలా చెలరేగిపోయిందనే విషయం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంలోకి రాదనే అత్యుత్సాహంతో మాటల్లో చెప్పలేని విధంగా తన వీడియోలతో దూషించింది. ఇక ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలకు ముందు.. జూన్ 4వ తేదీన నా ఈకలు పీక్కుంటారా? అంటూ సవాల్ విసిరింది. ఇదంతా వైసీపీ సోషల్ మీడియాకు అధినేతగా వ్యవహరించిన నేత డైరెక్షన్‌లోనే శ్రీరెడ్డి యాక్టింగ్ చేసిందని ఇటీవల ఓ పోలీస్ ఉన్నతాధికారి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

Will Actress Sri Reddy Arrest imminent by Andhra Police in objectional posts in Social Media

శ్రీరెడ్డి నమ్మకం, ఆత్మవిశ్వాసా్ని దెబ్బతినేలా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవ్వడం ఓ షాకింగ్‌గా మారింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటమే కాకుండా వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు తీర్పు ఇచ్చారు. దాంతో శ్రీరెడ్డికి వాస్తవం గుర్తుకు వచ్చింది. దాంతో తాను చేసిన తప్పును సరిద్దిద్దుకొనే ప్రయత్నం చేసింది. ఆ విధంగా ఓ వీడియోను రిలీజ్ చేసింది.

శ్రీరెడ్డి వీడియో రిలీజ్ చేసి.. లోకేష్ గారు మీకు సారీ.. అలాగే మీకు మీ అమ్మగారికి, మీ భార్యకు సారీ. అలాగే హోంమంత్రి అనిత గారికి కూడా సారీ. అలాగే పవన్ కల్యాణ్ గారికి, మీ కుటుంబ సభ్యులకు సారీ. నాకు కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని నా వల్ల నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని ఈ నిర్ణయం తీసుకొన్నాను అని శ్రీరెడ్డి అన్నారు. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ.. ఆ విధంగానీ, ఏ విధంగా తప్పుడుగా మాట్లాడబోను. మీ చర్యలు, మీ వార్ కార్యకర్తలపై కాకుండా లీడర్స్, లీడర్స్‌కు మధ్య జరిగేలా చూసుకోవాలని నేను కోరుతున్నాను. ఇదే నా విన్నపం. నా తలవంచి నమస్కరిస్తూ అడుగుతున్నాను. నన్ను, నా కార్యకర్తలను వదిలిపెట్టండి. నన్ను కూడా క్షమించండి అంటూ వీడియోను ముగించారు.

Will Actress Sri Reddy Arrest imminent by Andhra Police in objectional posts in Social Media

అయితే అంతా శ్రీరెడ్డిని క్షమించేస్తారని భావించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేశ్, అనితపై దుర్భాషలాడిన శ్రీరెడ్డిపై తెలుగు మహిళ సభ్యులు అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డిపై చర్యలకు డిమాండ్ చేస్తూ రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి, కే వసంత చెన్నా సత్యవతి, యర్రంశెట్టి ఈశ్వరి ఫిర్యాదు చేశారు. దాంతో శ్రీరెడ్డిని అరెస్ట్ చేయడం తథ్యమని ప్రధాన మీడియాలో కథనాలు ఊపందుకొన్నాయి.

అయితే సారీ, క్షమించమని వేడుకొన్నప్పటికీ.. ఏపీ ప్రభుత్వం కనికరం చూపలేదనే సంకేతాలు వచ్చేశాయి. శ్రీరెడ్డిని అరెస్ట్ చేసేందుకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అయితే సోషల్ మీడియాలో తమ కుటుంబాన్ని తీవ్రంగా వేధించినందుకు గాను లోకేష్ సీరియస్‌గా ఉన్నారు. ఆయన ఈ విషయంలో ఎవరినీ క్షమించబోరని పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. అయితే శ్రీరెడ్డి, రాంగోపాల్ వర్మ విషయంలో ఏం జరుగుతుందో అనేది అందరిలోను ఆసక్తిని రేపుతున్నది.

More from Filmibeat

Read more about: sri reddy pawan kalyan ys jagan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X