Just In
- 2 hrs ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 3 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 4 hrs ago
పబ్లిక్ ప్లేస్లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్తో రెచ్చిపోయిన శ్రియ
- 4 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
Don't Miss!
- News
రైతుల నిరసన: మహిళా దినోత్సవం రోజున ఢిల్లీ వైపు 40వేల మంది మహిళలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్: హీరోయిన్లతో విజయ్ హంగామా ఎక్కడో తెలుసా..?
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్'. యూత్ ఆడియన్స్కి కిక్కిచ్చేలా ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్తో రొమాన్స్ చేశాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి.
ప్రస్తుతం ప్రమోషన్స్తో బిజీగా ఉన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. ఈ మేరకు వైజాగ్ సిరిపురం లోని గురజాడ కళాక్షేత్రాన్ని వేదికగా ప్రకటించారు. ఈ వేడుకకు చిత్ర దర్శకనిర్మాతలతో పాటు విజయ్ దేవరకొండ, నలుగురు హీరోయిన్స్ రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజా బెల్లా, క్యాథెరిన్ ట్రెసా హాజరై సందడి చేయనున్నారు.

ఇకపోతే టైటిల్కి తగ్గట్టే ఈ సినిమాను లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేస్తుండటంతో యువత అంతా ఈ సినిమా కోసం ఎగబడుతున్నారు. దీంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 190 షోలకు గాను ఇప్పటికే బుక్ మై షోలో 120 షోలు ఫుల్ అయ్యాయి.
క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమా ద్వారా మరోసారి యూత్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నాడు విజయ్. చిత్రంలో విజయ్ సరసన రాశీఖన్నా, కేథరిన్ ట్రెసా, ఇజబెల్లా లీట్ హీరోయిన్లుగా నటించారు. గోపీసుందర్ అందించిన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు మేకర్స్.