Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
మెగాస్టార్ రీమేక్ కోసం సీనియర్ రైటర్.. నిజంగానే ఇది బంపర్ ఆఫర్
మెగాపవర్ స్టార్ చిరంజీవి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై ఎవరు ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన ఒకసారి నమ్మితే ఎంతగా ప్రోత్సహిస్తారో మరోసారి ఋజువవుతోంది. గతంలో బాక్సాఫీస్ హిట్స్ అందుకొని ఇప్పుడు అవకాశాలు లేక సతమతమవుతున్న వారిని మెగాస్టార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మెహర్ రమేష్ తో వేదాళం రీమేక్ చేయనున్న మెగాస్టార్ ఆ తరువాత వినాయక్ తో మలయాళం రీమేక్ లూసిఫర్ ని సెట్స్ పైకి తెనున్న విషయం తెలిసిందే.
గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నారని అనిపిస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే లూసిఫర్ కోసం మొదట సాహో డైరెక్టర్ సుజిత్ ని సెలెక్ట్ చేసుకున్న చిరంజీవి ఆ తరువాత అతను తప్పుకోవడంతో వినాయక్ ని లైన్ లో పెట్టాడు. ఇక ఆ మలయాళం కథను పూర్తిగా మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ కి సెట్టయ్యే విధంగా రెడీ చేయనున్నారు. దర్శకుడు వినాయక్ అందుకోసం సీనియర్ రైటర్ ఆకుల శివను లైన్ లో పెట్టాడు.
కృష్ణ, లక్ష్మీ వంటి హిట్ సినిమాలకు శివ, వినాయక్ తో కలిసి పని చేశాడు. ఇక ఫైనల్ గా మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ ఇద్దరికి బంపర్ ఆఫర్ వచ్చింది. మెగాస్టార్ నెక్స్ట్ ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మెహర్ రమేష్, వినాయక్ ప్రాజెక్టులను వచ్చే ఏడాది ఒక దాని తరువాత మరొకటి స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.