Don't Miss!
- Sports CSK vs LSG: కొంపముంచిన ముస్తాఫిజుర్.. లక్నోను గెలిపించిన స్టోయినిస్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘సాహో’ ఓవర్సీస్ రైట్స్ చేతులు మారాయి... రంగంలోకి ప్రముఖ సంస్థ!
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ యాక్షన్ ఫిల్మ్ 'సాహో'. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ హీరోయిన్. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న బిగ్ బడ్జెట్ చిత్రం కావడం, అంచనాలు భారీగా ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది.
ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ 'ఫర్ ఫిల్మ్స్' సంస్థ రూ. 42 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సంస్థకు గల్ఫ్ ఏరియాలో బలమైన థియేటర్ నెట్వర్క్ ఉంది. గల్ఫ్లో సగానికిపైగా ఎక్కువ థియేటర్లు ఈ సంస్థకు చెందినవే. అయితే బయటి దేశాల్లో మాత్రం పరిస్థితి అలా లేదు.
ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల్లో విడుదల చేసేందుకు యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. గల్ఫ్ మినహా ఇతర అన్ని దేశాల రైట్స్ యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థకు రూ. 21 కోట్లకు మినిమమ్ గ్యారంటీ బేసిస్ మీద అమ్మినట్లు తెలుస్తోంది. ఇది ఒక ఆశ్చర్యకరమైన డీల్గా ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
రూ. 300 కోట్ల బడ్జెట్తో యూవి క్రియేషన్స్ సంస్థ 'సాహో' చిత్రాన్ని నిర్మించింది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా... నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, ఎవలీన్ శర్మ, మురళీ శర్మ, ఆదిత్య శ్రీవాస్తవ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న ఈ మూవీ విడుదల కాబోతోంది.