Don't Miss!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
‘సాహో’ ఓవర్సీస్ రైట్స్ చేతులు మారాయి... రంగంలోకి ప్రముఖ సంస్థ!
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ యాక్షన్ ఫిల్మ్ 'సాహో'. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ హీరోయిన్. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న బిగ్ బడ్జెట్ చిత్రం కావడం, అంచనాలు భారీగా ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది.
ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ 'ఫర్ ఫిల్మ్స్' సంస్థ రూ. 42 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సంస్థకు గల్ఫ్ ఏరియాలో బలమైన థియేటర్ నెట్వర్క్ ఉంది. గల్ఫ్లో సగానికిపైగా ఎక్కువ థియేటర్లు ఈ సంస్థకు చెందినవే. అయితే బయటి దేశాల్లో మాత్రం పరిస్థితి అలా లేదు.
ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల్లో విడుదల చేసేందుకు యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. గల్ఫ్ మినహా ఇతర అన్ని దేశాల రైట్స్ యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థకు రూ. 21 కోట్లకు మినిమమ్ గ్యారంటీ బేసిస్ మీద అమ్మినట్లు తెలుస్తోంది. ఇది ఒక ఆశ్చర్యకరమైన డీల్గా ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
రూ. 300 కోట్ల బడ్జెట్తో యూవి క్రియేషన్స్ సంస్థ 'సాహో' చిత్రాన్ని నిర్మించింది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా... నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, ఎవలీన్ శర్మ, మురళీ శర్మ, ఆదిత్య శ్రీవాస్తవ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న ఈ మూవీ విడుదల కాబోతోంది.