మగాళ్లపై అత్యాచారం జరిగితే? తెలుగు అడల్ట్ మూవీలో బిగ్బాస్ భానుశ్రీ... సంచలనం రేపుతున్న టీజర్!
Recommended Video

పూర్తి అడల్డ్ కామెడీ జోనర్లో తెలుగులో వినోదం పంచడానికి 'ఏడు చేపల కథ' పేరుతో ఓ సినిమా రాబోతోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్తో ఆకట్టుకున్న ఈ చిత్రం టీజర్ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. అభిషేక్ రెడ్డి, బిగ్ బాస్ ఫేం భాను శ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని చరిత సినిమా ఆర్ట్స్ పతాకం మీద డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జివిఎన్ నిర్మిస్తున్నారు.

ఆడవారు ఎవరైనా ఎక్స్ ఫోజింగ్ చేస్తే చూసి నిగ్రహించుకునే శక్తి లేదు
డాక్టర్ దగ్గరకు వచ్చిన రవి అనే వ్యక్తి తన సమస్య చెబుతూ టీజర్ ప్రారంభం అవుతుంది. నా ముందు ఆడవారు ఎవరైనా ఎక్స్ ఫోజింగ్ చేస్తే చూసి నిగ్రహించుకునే శక్తి లేదంటూ... తన వీక్నెస్ పోగొట్టాలంటూ కోరడం చూస్తుంటే ఇది పక్కా అడల్ట్ కామెడీ సినిమా అని స్పష్టమవుతోంది.

బిగ్ బాస్ భానుశ్రీ కూడా
ఈ చిత్రంలో బిగ్ బాస్ 2 ఫేం భానుశ్రీ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. అయితే ఇందులో ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.
మగాళ్ల మీద ఆడవారు చేసే అఘాయిత్యాలను ఆధారాలతో అరిచి ఘీ పెట్టి చెప్పినా
ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ.... "ఆడవాళ్ల మీద మగవారు చేసిన అఘాయిత్యాలు... ఆధారాలు లేకపోయినా, ఆరు సంవత్సరాల తర్వాత అయినా మనం నమ్ముతున్నాం. కానీ మగాళ్ల మీద ఆడవారు చేసే అఘాయిత్యాలను ఆధారాలతో అరిచి ఘీ పెట్టి చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అందుకే మగవారి తరపున MeToo అంటూ టెమ్ట్ రవి అనే ప్రయోగాత్మక పాత్రను "ఏడు చేపల కథ" చిత్రంతో పరిచయం చేస్తున్నాం.

ఏడు చేపల కథ
నటీనటులు: అభిషేక్ రెడ్డి, భానుశ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్: చరిత సినిమా ఆర్ట్స్
సమర్పణ: డా.రాకేష్ రెడ్డి
నిర్మాతలు: శేఖర్ రెడ్డి, జివిఎన్
సహ నిర్మాత: గుండ్ర లక్ష్మీ రెడ్డి,
సంగీతం: కవి శంకర్,
కెమెరా: ఆర్లీ,
పిఆర్ఓ: ఏలూరు శ్రీను,
రచన, దర్శకత్వం: శామ్ జే చైతన్య


Click it and Unblock the Notifications











