Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
టాలీవుడ్కు మరో యువ హీరో.. విభిన్నమైన సినిమాతో రెడీ..
తెలుగు సినీ పరిశ్రమకు మరో ప్రతిభావంతుడైన యువకుడు హీరోగా పరిచయం కాబోతున్నారు. ఆర్వీజీ మూవీస్, ఎస్వీఎల్ ఎంటర్ప్రైజెస్ సంయుక్తంగా రూపొందించే చిత్రం ద్వారా శివాంశు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లోని సత్యసాయి నిగమాగమంలోని గణేష్ టెంపుల్లో జరిగింది. ముహూర్తపు షాట్కు... మాటలు-పాటలు అందిస్తున్న ప్రముఖ రచయిత వీఎస్పి తెన్నేటి కెమెరా స్విచాన్ చేయగా, శ్రీమతి స్వాతి రుద్రాపట్ల క్లాప్ కొట్టారు.
ఈ చిత్రానికి రవిశంకర్ ఓంకాలి, తలారి వినోద్ కుమార్ ముదిరాజ్, శ్రీనివాస్ మామిడాల, లలిత్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు దర్శకుడిగా రుద్రాపట్ల వేణుగోపాల్ వ్యవహరించనున్నారు.
యువ హీరో శివాంశు సరసన ప్రాచీరాయ్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ ఆమని ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
దర్శక, నిర్మాత రుద్రాపట్ల వేణుగోపాల్ మాట్లాడుతూ... నా రూపొందించే ప్రతి చిత్రంలో కొత్తవారిని పరిచయం చేయడం అలవాటు. అదే క్రమంలో శివాంశును హీరోగా పరిచయం చేస్తున్నాను అని అన్నారు.