Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
టాలీవుడ్కు మరో యువ హీరో.. విభిన్నమైన సినిమాతో రెడీ..
తెలుగు సినీ పరిశ్రమకు మరో ప్రతిభావంతుడైన యువకుడు హీరోగా పరిచయం కాబోతున్నారు. ఆర్వీజీ మూవీస్, ఎస్వీఎల్ ఎంటర్ప్రైజెస్ సంయుక్తంగా రూపొందించే చిత్రం ద్వారా శివాంశు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లోని సత్యసాయి నిగమాగమంలోని గణేష్ టెంపుల్లో జరిగింది. ముహూర్తపు షాట్కు... మాటలు-పాటలు అందిస్తున్న ప్రముఖ రచయిత వీఎస్పి తెన్నేటి కెమెరా స్విచాన్ చేయగా, శ్రీమతి స్వాతి రుద్రాపట్ల క్లాప్ కొట్టారు.
ఈ చిత్రానికి రవిశంకర్ ఓంకాలి, తలారి వినోద్ కుమార్ ముదిరాజ్, శ్రీనివాస్ మామిడాల, లలిత్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు దర్శకుడిగా రుద్రాపట్ల వేణుగోపాల్ వ్యవహరించనున్నారు.
యువ హీరో శివాంశు సరసన ప్రాచీరాయ్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ ఆమని ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
దర్శక, నిర్మాత రుద్రాపట్ల వేణుగోపాల్ మాట్లాడుతూ... నా రూపొందించే ప్రతి చిత్రంలో కొత్తవారిని పరిచయం చేయడం అలవాటు. అదే క్రమంలో శివాంశును హీరోగా పరిచయం చేస్తున్నాను అని అన్నారు.