Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
టాలీవుడ్కు మరో యువ హీరో.. విభిన్నమైన సినిమాతో రెడీ..
తెలుగు సినీ పరిశ్రమకు మరో ప్రతిభావంతుడైన యువకుడు హీరోగా పరిచయం కాబోతున్నారు. ఆర్వీజీ మూవీస్, ఎస్వీఎల్ ఎంటర్ప్రైజెస్ సంయుక్తంగా రూపొందించే చిత్రం ద్వారా శివాంశు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లోని సత్యసాయి నిగమాగమంలోని గణేష్ టెంపుల్లో జరిగింది. ముహూర్తపు షాట్కు... మాటలు-పాటలు అందిస్తున్న ప్రముఖ రచయిత వీఎస్పి తెన్నేటి కెమెరా స్విచాన్ చేయగా, శ్రీమతి స్వాతి రుద్రాపట్ల క్లాప్ కొట్టారు.
ఈ చిత్రానికి రవిశంకర్ ఓంకాలి, తలారి వినోద్ కుమార్ ముదిరాజ్, శ్రీనివాస్ మామిడాల, లలిత్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు దర్శకుడిగా రుద్రాపట్ల వేణుగోపాల్ వ్యవహరించనున్నారు.
యువ హీరో శివాంశు సరసన ప్రాచీరాయ్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ ఆమని ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
దర్శక, నిర్మాత రుద్రాపట్ల వేణుగోపాల్ మాట్లాడుతూ... నా రూపొందించే ప్రతి చిత్రంలో కొత్తవారిని పరిచయం చేయడం అలవాటు. అదే క్రమంలో శివాంశును హీరోగా పరిచయం చేస్తున్నాను అని అన్నారు.