Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రభాస్ సినిమాలో ఛాన్స్.. యంగ్ హీరోయిన్ కిడ్నాప్ సంచలనం.. కేసులో ఊహించని మలుపు!!
'రాహు' మూవీ హీరోయిన్ కృతి గార్గ్ కిడ్నాప్ జరిగిందనే విషయం సోషల్ మీడియాలో హాట్ ఇష్యూగా మారిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన ఓ వ్యక్తి ప్రభాస్ సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పి ఆమెను కిడ్నాప్ చేశాడని వార్తలు వచ్చాయి. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు కావడంతో ఈ ఉదంతం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో కేసులో ఊహించని మలుపు చోటుచేసుకోవడంతో అంతా షాకవుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది? వివరాల్లోకి పోతే..
ప్రభాస్ క్రేజ్.. హీరోయిన్ ట్రాప్
దేశవ్యాప్తంగా రెబల్ స్టార్ ప్రభాస్కి ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. బాహుబలి సినిమాతో వరల్డ్ స్టార్ గా ఎదిగిన ఆయనతో నటించేందుకు ఏ హీరోయిన్ అయినా ముందే ఉంటుంది. అయితే ఇదే అంశాన్ని క్యాచ్ చేసుకుంటూ 'రాహు' హీరోయిన్ కృతి గార్గ్ని ట్రాప్ చేశారని కేసు నమోదైంది.
ఆచూకీ లేదు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ప్రభాస్ సినిమాలో ఛాన్స్ ఇస్తా.. నేను సందీప్ రెడ్డి వంగాను అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేయడంతో హీరోయిన్ కృతి గార్గ్ ముంబై వెళ్లడం జరిగిందని, ఆ తర్వాత కొన్ని గంటలకు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, ఎక్కడుందో ఆచూకీ తెలియడం లేదని పేర్కొంటూ 'రాహు' మూవీ డైరెక్టర్ సుబ్బు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
నయా మోసం.. కృతి గార్గ్ ఎంటర్
దీంతో హీరోయిన్ కృతి గార్గ్ మ్యాటర్ ఒక్కసారిగా జనం నోళ్ళలో నానిపోయింది. ఆమె ఎక్కడికెళ్లింది? ప్రభాస్ పేరు చెప్పి ఈ రకంగా కూడా కిడ్నాప్స్ జరుగుతున్నాయా? నయా మోసం.. అంటూ అంతా చర్చలు మొదలయ్యాయి. ఈ తరుణంలో ఊహించని విధంగా హీరోయిన్ కృతి గార్గ్ స్వయంగా అందరి ముందుకొచ్చింది.
హీరోయిన్ కిడ్నాప్ ఇష్యూ.. క్లారిటీ
తాను ముంబైకి ఉదయమే ఫ్లైట్లో చేరుకున్నానని, ఆ తర్వాత అలసిపోయి ముంబైలో ఉన్న ఇంటికి వెళ్లానని చెప్పింది కృతి గార్గ్. ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మరిచిపోవడంతో స్విచ్చాఫ్ అయిందని పేర్కొంటూ ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చేసింది. దీంతో హీరోయిన్ కిడ్నాప్ ఇష్యూకి తెరపడింది.
Recommended Video
కావాలనే ఈ ప్లాన్ చేశారా?
మరోవైపు కృతి గార్గ్ నటించిన రాహు సినిమా ఇటీవలే విడుదలై మంచి టాక్తో దూసుకుపోతుంది. దీంతో తమ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకే దర్శకుడు సుబ్బు, హీరోయిన్ కృతి గార్గ్ కావాలనే ఈ ప్లాన్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు కొందరు. ఎలాగైతేనేం కృతి గార్గ్ పేరు మాత్రం ఒక్కసారిగా జనం నోళ్ళలో నానిపోయింది.