Don't Miss!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'యాత్ర' ఎమోషనల్ టీజర్: నేను విన్నాను.. నేనున్నాను.. వైఎస్ఆర్గా మమ్ముట్టి!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర. వైఎస్ఆర్ పాత్రలో మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి గెటప్లో మమ్ముట్టి ఒదిగిపోయి నటిస్తున్నాడు. మమ్ముట్టి వేషధారణ మొత్తం రాజశేఖర్ రెడ్డిని తలపించే విధంగా ఉంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఎమోషనల్ టీజర్ విడుదల చేసింది.
మమ్ముట్టి పాదయాత్ర చేస్తూ రైతుల సమస్యలని తెలుసుకుంటున్నారు. నీరు ఉంటే కరెంటు ఉండదు.. కరెంటు ఉంటే నీరు ఉండదు.. రెండు ఉండి పంట చేతికి వస్తే సరైన ధర ఉండదు. రైతులు రాజులుగా కాదు.. కనీసం రైతులుగా బ్రతకానిస్తే చలాలు అంటూ సాగే ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. వైఎస్ పాత్రలో ఉన్న మమ్ముట్టి.. నేను విన్నాను.. నేనున్నాను అంటూ డైలాగ్ చెబుతున్నాడు.
యాత్ర చిత్రాన్ని దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో జగపతి బాబు, అనసూయ, సుహాసిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. ఫిబ్రవరి 8న యాత్ర చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.